ఆదర్శ పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయ్!
జిల్లాలోని ఆదర్శపాఠశాలలు ప్రైవేటు బడులకు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాయి. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట, న్యూస్టుడే: జిల్లాలోని ఆదర్శపాఠశాలలు ప్రైవేటు బడులకు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాయి. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఏటా ఆదర్శపాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. ఆంగ్ల మాధ్యమం కూడా ఉండడంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2023-24)లో ఆరో తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
ప్రతిభ ఆధారంగా ఎంపిక
జిల్లాలో 8 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6 నుంచి 10 వరకు తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్య కూడా అందిస్తున్నారు. ప్రతి విద్యాలయంలో వంద మందికి ప్రవేశాలు కల్పిస్తారు. తొలినాళ్లలో విద్యార్థుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేవారు. పక్కా భవనాలు, ఇతర వసతులు లేకపోయినా నాణ్యమైన బోధనతో మంచి ఫలితాలు సాధించారు. మరో వైపు పిల్లల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి, ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. 7 నుంచి పది వరకు ఖాళీలను కూడా ఇదే తరహాలో భర్తీ చేస్తున్నారు.
పరీక్ష విధానం..
జనవరి 10న దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఏప్రిల్ 8న హాల్ టికెట్లను విడుదల చేస్తారు. అదే నెల 16న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇతర తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. మే 15న ఫలితాలను విడుదల చేస్తారు.
ఉన్నత ప్రమాణాలతో..
పదో తరగతి విద్యార్థులు ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఆదర్శపాఠశాలల్లో అన్ని వసతులు కల్పించారు. పక్కా భవనాలు నిర్మించి సీసీ కెమెరాలను అమర్చారు. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తర్ఫీదు ఇస్తున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో మెలకువలు నేర్పిస్తున్నారు.
దరఖాస్తు విధానం ఇలా..
గతంలో ప్రవేశ పరీక్షను ఆయా పాఠశాలల పరిధిలోనే నిర్వహించే వారు. ఐదేళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నారు. అన్ని తరగతుల వారికి తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాలకు సంబంధించి 75, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి 25 మార్కులు ఉంటాయి. ఓసీ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు రూ.125 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆదర్శపాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, విద్యార్థులను ఉత్తమంగా తీర్పిదిద్దేందుకు కృషి చేస్తున్నామని బచ్చన్నపేట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్