యారిటీ, ఖాళీల జాబితా విడుదల
జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ వెబ్సైట్లో శుక్రవారం సాయంత్రమే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాతో పాటు ఖాళీల వివరాలను పొందుపర్చారు.
సీనియారిటీ, ఖాళీల జాబితా విడుదల
తరగతి గదిలో విద్యార్థులు
భూపాలపల్లి, న్యూస్టుడే: జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ వెబ్సైట్లో శుక్రవారం సాయంత్రమే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాతో పాటు ఖాళీల వివరాలను పొందుపర్చారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలుత బదిలీలు, ఆ తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 432 విద్యాలయాలుండగా, మొత్తం 19,076 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం జిల్లాకు మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,804 ఉండగా ప్రస్తుతం 1,414 మంది ప్రభుత్వ బడుల్లో పనిచేస్తుండగా.. వారి సీనియారిటీతో కూడిన జాబితాను విడుదల చేశారు. పదోన్నతులు, బదిలీల కోసం 390 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో తప్పనిసరి బదిలీ కింద 282 మందికి స్థానచలనం కలగనుంది. వీరంతా ఒకే చోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారే కావడం గమనార్హం.. జీవో 317 కింద జిల్లాకు వచ్చిన వారికి జీరో సర్వీసు వర్తింపజేయనుండటంతో వారంతా బదిలీలకు దూరంగా ఉండనున్నారు. 317 జీవో ద్వారా ఈ జిల్లాకు వచ్చిన 753 మంది ఉపాధ్యాయులు ఇక్కడే విధులు నిర్వర్తించనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే వీరికి అనుకూలమైన ప్రాంతం లభిస్తేనే వారు ప్రస్తుతం ఉన్న స్థానాలను వదలనున్నారు.
పదోన్నతులు ఇలా..
అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నారు. జిల్లాలో పీజీహెచ్ఎం పోస్టులు 64కు ప్రస్తుతం 45 ఖాళీగా ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 79కి 43 ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియార్టీ ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్లకు, ఎస్టీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. అదేవిధంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల పోస్టులు(ఎస్ఏ) 114 ఖాళీగా ఉన్నాయి. ఇందులో గణితం 9, భౌతికశాస్త్రం 10, జీవశాస్త్రం 24, సాంఘికశాస్త్రం 33, తెలుగు 11, ఆంగ్లం 16, హిందీ 5, ఫిజికల్ డైౖరెక్టర్లు(పీడీ)లు 6 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70 శాతం ఖాళీలను సీనియార్టీ ప్రాతిపదికన అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేస్తారు. అలాగే ఒకే పాఠశాలలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. దీని ప్రకారం జిల్లాలో ఇటీవల 317 జీవో కింద బదిలీపై వచ్చినవారు 753 మంది ఉపాధ్యాయులు తప్ప మిగిలిన వారికి అర్హత ఉంటుంది. ఫిబ్రవరి 14న పీజీహెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. అదే నెల 16 నుంచి 18 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. 22, 23వ తేదీల్లో ఎస్ఏల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత 25 నుంచి 27వ తేదీ వరకు ఎస్జీటీలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అభ్యంతరాలకు మార్చి 5 నుంచి 19 వరకు అవకాశమిస్తారు.
వీరు కదలాల్సిందే..
ఒకే బడిలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న వారిలో జిల్లాలో 239 మంది స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరి బదిలీ కింద తమ స్థానాలు వదలుకోవాల్సి ఉంటుంది. అయిదేళ్లు పూర్తి చేసుకున్న పీజీహెచ్ఎంలు ఐదుగురు బదిలీ కానున్నారు. ఇందులో పీజీ హెచ్ఎం ఒక్కరు, ఎస్జీటీలు 179 మంది, భాషా పండితులు 20, పీఈటీలు ఐదుగురు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 9 మంది, స్కూల్ అసిస్టెంట్లు 69 మంది ఉపాధ్యాయులున్నారు. వారి సర్వీసు మూడేళ్లు మాత్రమే ఉంటే మినహాయింపు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు