ప్రైవేటులో కష్టమన్నారు.. నిమ్స్లో ప్రాణం పోశారు
ఆ యువతికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి సరిచేశారు. నాలుగేళ్ల నుంచి ఆ యువతికి గుండెలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
జాహ్నవితో వైద్యులు మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, హృద్రోగ నిపుణులు డాక్టర్ సాయి సతీష్, నిమ్స్ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితరులు
ఈనాడు, హైదరాబాద్: ఆ యువతికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి సరిచేశారు. నాలుగేళ్ల నుంచి ఆ యువతికి గుండెలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించగా చికిత్స చేసినా భరోసా ఇవ్వలేమని వారు చెప్పారు. ఆఖరి ప్రయత్నంగా నిమ్స్ వైద్యులను సంప్రదించగా వారు పునర్జన్మ ప్రసాదించారు. శనివారం నిమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్స్ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్ వివరాలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెపై భాగంలో రంధ్రం(ఏఎస్డీ)తోపాటు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వద్ద వాల్వు కూడా దెబ్బతింది. 3 ఏళ్ల వయసులో ఆమెకు వైద్యులు బైపాస్ సర్జరీ చేసి సరిచేశారు. ప్రస్తుతం 16 ఏళ్ల బాలిక నాలుగేళ్లుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించగా చాలా క్లిష్టమైన సమస్య అని.. రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అయినా హామీ ఇవ్వలేమన్నారని సదరు వైద్యులు తల్లిదండ్రులకు వివరించడంతో వారు యువతిని నిమ్స్లో చేర్పించారు. రంగంలోకి దిగిన డాక్టర్ సాయి సతీష్ ఇతర వైద్య బృందం వివిధ రకాల పరీక్షల చేసి యువతి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. గుండెలో రంధ్రం కారణంగా మంచి రక్తంలోకి చెడు రక్తం వచ్చి కలుస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా పల్మనరీ వాల్వు దెబ్బతినడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తం తిరిగి వెనక్కి వస్తున్నట్లు తేల్చారు. దీంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. మళ్లీ ఓపెన్ హార్టీ సర్జరీ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గుర్తించి కాలి నరం నుంచి క్యాథిటర్ ద్వారా ఏఎస్డీ పరికరంతోపాటు కృత్రిమ వాల్వు పరికరం పంపి.. రెండు సమస్యలకు ఒకేసారి చికిత్స చేశామని వైద్యులు వివరించారు. నిమ్స్ చరిత్రలోనే ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారని డా.సాయి సతీష్ వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రెండు, మూడు మాత్రం ఇలాంటి సర్జరీలు జరిగాయన్నారు. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. యువతి పూర్తిగా కోలుకుందని రెండు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామన్నారు. ఇందుకు రూ.14 లక్షల వరకు ఖర్చు అయిందని యవతి తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో పూర్తి బీమా కింద చికిత్స అందినట్లు చెప్పారు. జాహ్నవి మాట్లాడుతూ తనకు తిరిగి జీవితాన్ని ఇచ్చిన వైద్యుల స్ఫూర్తితో తాను కూడా డాక్టర్ను అవుతానని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.