పర్వతమెక్కిన శివయ్య
పర్వతగిరి పెద్ద చెరువు రిజర్వాయర్ సమీపంలోని కొండపై నిర్మించిన పర్వతాల శివాలయంలో శనివారం అంగరంగ వైభవంగా విగ్రహ, యంత్ర ప్రతిష్ఠాపక కార్యక్రమాలు కనులపండువగా సాగాయి
విగ్రహ ప్రతిష్ఠకు తరలివచ్చిన భక్తులు
పర్వతగిరి, న్యూస్టుడే: పర్వతగిరి పెద్ద చెరువు రిజర్వాయర్ సమీపంలోని కొండపై నిర్మించిన పర్వతాల శివాలయంలో శనివారం అంగరంగ వైభవంగా విగ్రహ, యంత్ర ప్రతిష్ఠాపక కార్యక్రమాలు కనులపండువగా సాగాయి. శివయ్య దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలిరాడంతో శివనామస్మరణతో పర్వతం మారుమోగింది. శివ క్షేత్రం పీఠాధిపతి శివస్వామితో విగ్రహ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాల నిర్వహించగా పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబసభ్యులు, ఎర్రబెల్లి రామ్మోహన్రావు దంపతులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు.
పూజల్లో పాల్గొన్న ప్రముఖులు
విగ్రహ, యంత్ర ప్రతిష్ఠ మహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని అర్చన కార్యక్రమాలను చేపట్టారు. వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, హుస్నాబాద్, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, బానోతు శంకర్నాయక్ దంపతులు, వొడితల సతీష్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగామ జడ్పీ ఛైర్మన్ సంపత్రెడ్డి దంపతులు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, రాష్ట్ర రుణవిమోచన కన్వీనర్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ మునిసిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్, కమిషనర్ ప్రసన్నవాణి, భాజపా జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెలే ధర్మారావు, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, స్పెషల్ కమిషనర్ వీఎస్ఎన్ ప్రసాద్, మెంబర్ సెక్రటరీ ఎ.రాజారావు, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, పంచాయతీరాజ్ ఈఎస్సీ సంజీవరావు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపీ, శశాంక్ దంపతులు హాజరయ్యారు. వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, టీఎస్ఎస్ 4వ బెటాలియన్ కమాండెంట్లు, డీఆర్డీవో సంపత్రావు, జడ్పీ సీఈవో సాహితీమిత్ర, మూమునూరు ఏసీపీ నరేష్కుమార్ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్ధప్రసాదాలు తీసుకున్నారు. వారి వెంట ఎంపీపీ కమల, జడ్పీటీసీ సభ్యుడు సింగులాల్, కల్లెడ సొసైటీ ఛైర్మన్ మనోజ్గౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మేడిశెట్టి రాములు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, స్థానిక సర్పంచి మాలతి, ఎంపీటీసీ సభ్యుడు రాజు, సోమేశ్వర్రావు, సర్వర్, శ్యాంగౌడ్, మధు, సందెల నవీన్, రంగు జనార్దన్గౌడ్, సీఏ రాజు, కాట్రోజు రాజు తదితరులు ఉన్నారు. మూడు రోజులుగా సాగిన పర్వతాల శివాలయం విగ్రహ పునః ప్రతిష్ఠ వేడుకలు శనివారంతో ముగిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం
[ 18-04-2024]
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. -
అందరి సంక్షేమం.. పార్టీల సంకల్పం
[ 18-04-2024]
ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం.. -
నామపత్రాలకు వేళాయె!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
లోక్సభ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ
[ 18-04-2024]
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తెలిపారు. -
ఓటరుకు ఆహ్వానం..
[ 18-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
అటవీ సంరక్షకులు..!
[ 18-04-2024]
వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు. -
దేవాదుల పంపింగ్ ఆగింది.. పంట ఎండింది..
[ 18-04-2024]
ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. -
పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?
[ 18-04-2024]
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
లోక్సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 18-04-2024]
ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
‘రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన భారాస’
[ 18-04-2024]
‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ఆరోపించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సూచించారు. -
డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!
[ 18-04-2024]
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. -
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల నరికివేత
[ 18-04-2024]
కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సివిల్స్ ర్యాంకర్లకు ఘన సత్కారం
[ 18-04-2024]
సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్ కుమారుడు మెరుగు కౌశిక్ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్ ఫెడరేషన్), ఐవీఎఫ్(ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్), ఇతర ప్రతినిధులు హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. -
చేసిన పనులకు బిల్లులివ్వకపోతే చనిపోతా..
[ 18-04-2024]
‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..