మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఏదీ?
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల అనుసంధాన పథకం, స్త్రీనిధి, పొదుపు నిధి నుంచి రుణాలు ఇస్తున్నారు.
మూడేళ్లుగా ఎదురు చూపులు
సమావేశంలో పాల్గొన్న మెప్మా మహిళా సంఘాల సభ్యులు (పాతచిత్రం)
జనగామ, న్యూస్టుడే: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల అనుసంధాన పథకం, స్త్రీనిధి, పొదుపు నిధి నుంచి రుణాలు ఇస్తున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా తొలుత పావలా వడ్డీకి రుణాలు అందజేశారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణ (వీఎల్ఆర్) పథకాన్ని 2015-16 నుంచి అమలు చేస్తున్నారు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించిన పొదుపు సంఘాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించింది. చెల్లించిన వడ్డీని తిరిగి బ్యాంకుల ద్వారా వారి ఖాతాలకు జమ చేయడం ఈ పథకం ఉద్దేశం. జనగామ పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు మూడేళ్లుగా వడ్డీ రాయితీ రావడం లేదు. దీంతో సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొదుపు.. రుణాలే ఉపాధిగా..
పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ప్రభుత్వపరమైన ఉపాధి అవకాశాలు ఉండవు. దీంతో వారు నిర్మాణ రంగం, దుకాణాలు, ఇళ్లలో పనులు, చిరు, వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పట్టణలోని పేద మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా పలు పథకాలు అమలవుతున్నాయి. బ్యాంకులు, ఇతర పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారు.
తిరకాసులు..తిప్పలు: పొదుపు సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ అందజేసేందుకు తిరకాసులు ఉన్నాయి. క్రమం తప్పకుండా నెలవారీ కిస్తులు చెల్లించాలి. రుణంతో పాటు నిర్దేశిత వడ్డీని సకాలంలో చెల్లించాలి. రూ.100కు 80 పైసల నుంచి రూపాయి వరకు వడ్డీ చెల్లిస్తున్నామని మహిళలు అంటున్నారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించింనప్పుడు ఆర్నెల్లలోపు వారి ఖాతాలకు వడ్డీ రాయితీ సొమ్మును జమ చేయాల్సి ఉంది. ఒకటి, రెండు మాసాలు ఆలస్యంగా చెల్లించినా రాయితీ అందని పరిస్థితులు ఉన్నాయి.
* జనగామ మున్సిపల్ పరిధిలో గత డిసెంబరు నివేదికను అనుసరించి 934 పొదుపు సంఘాలు, 35 వార్డు కమిటీలు, ఒక పట్టణ కమిటీ పరిధిలో సుమారు 9 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పొదుపు, రుణ స్వీకరణ, చెల్లింపుల కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయి. 2015-16 నుంచి 2022 వరకు గణాంకాలను పరిశీలిస్తే, నానాటికీ వడ్డీ రాయితీ పొందే సంఘాల సంఖ్య తగ్గిపోతుండటం గమనార్హం.
ఎందుకీ తరుగుదల ?
2015-16 నుంచి 2018-19 వరకు 900 సంఘాలకు గాను 500 పైగా సంఘాలకు వడ్డీ రాయితీ లభించింది. గత రెండేళ్ల లెక్కలను పరిశీలిస్తే 200 లోపు సంఘాలు మాత్రమే రాయితీ పొందేందుకు అర్హత సాధించాయి. జనగామలో రూ.20 లక్షల వరకు అప్పు తీసుకుంటున్న సంఘాలున్నాయి. రూ.7.50 లక్షల వరకు బ్యాంకు లోన్ తీసుకొని సక్రమంగా చెల్లించిన సంఘాలకే వడ్డీ రాయితీ వర్తిస్తుందంటున్నారు. దీంతో పేద మహిళలు అధిక రుణం తీసుకొని, అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.
అన్ని గ్రూపులకు వర్తింపజేయాలి
- ఆకుల సరిత, మెప్మా జనగామ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు
2019-20 నుంచి వడ్డీ రాయితీ రావడం లేదు. ఎంత రుణం తీసుకున్నా వడ్డీరాయితీ పథకాన్ని వర్తింపజేయాలి. వెంటనే బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రతిపాదన పంపించాం
- రాజేందర్, పట్టణ మెప్మా అధికారి
ఎన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ వర్తిస్తుందనేది మా పరిధిలో ఉండదు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించే వారి వివరాలను మెప్మా ప్రధాన కార్యాలయం పర్యవేక్షిస్తుంది. అక్కడి నుంచే రాయితీకి అర్హత కలిగిన సంఘాల వివరాలు వస్తాయి. బకాయిల వివరాలతో ప్రతిపాదన పంపించాము. నిధులు వస్తే నేరుగా వారి ఖాతాలకు జమ అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!