‘ప్రజా సమస్యలు విస్మరించిన ఎమ్మెల్యే’
భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర ఇంత వరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు.
కృష్ణాకాలనీలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
భూపాలపల్లి, న్యూస్టుడే : భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర ఇంత వరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. ‘హత్ సే హాత్ జోడో యాత్ర’ లో భాగంగా నాలుగో రోజు ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్, కారల్మార్క్స్కాలనీ, యాదవకాలనీ, కృష్ణాకాలనీ, టీ2 మాదిరి క్వార్టర్లు, జవహర్నగర్కాలనీ, జయశంకర్, సత్తార్నగర్, హైటెక్ కాలనీల్లో యాత్ర కొనసాగించారు. యాత్రకు ముందుగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు కాలనీల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పలు కార్మిక కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేశారు. ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటు సమస్యలు జీఎస్సార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కృష్ణాకాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎస్సార్ మాట్లాడుతూ.. గోదావరి జలాలు తలాపునే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని అందించ లేదని, పట్టణంలోని ప్రధాన రహదారిపై ఇసుక, బొగ్గు లారీలు తిరగడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పట్టణ ప్రజల సౌకర్యం కోసం రింగ్రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని, కార్మిక కుటుంబాలకు సరైన వైద్యం అందకపోవడంతో వారు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సరోజన, దాట్ల శ్రీను, నాయకులు దేవన్, చల్లూరి మధు, బుర్ర కొంరయ్య, సంతోష్, కరుణాకర్, రాజేందర్, రాజన్న, పాజిల్, రాజేష్, రంజిత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్