ఉబికి వచ్చిన.. పాతాళ గంగ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి.
ఫీజోమీటర్ సహాయంతో భూగర్భ జలాలను లెక్కిస్తున్న అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. ముఖ్యంగా గత జులై, ఆగస్టులో వానలు దంచికొట్టడంతో చెరువులు, కుంటలు, ఇతర నీటి నిల్వ కేంద్రాలు పొంగి పొర్లాయి. దీంతో జిల్లా అంతటా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళతో ఆకట్టుకుంటున్నాయి. బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పెరగడంతో అన్నదాతలకు యాసంగి పంటల సాగుకు ఎలాంటి ఢోకా ఉండదనే ఆనందంలో రైతులు ఉన్నారు. నీరు సరిపడా ఉందని అవసరానికి మించి వృథా చేయకుండా పొదుపు చర్యలు చేపట్టాలని భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు.
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్
సగటున 7.26 మీటర్ల లోతు..
గత జనవరిలో 9.44 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా ఈ సారి ఇదే నెలలో భూగర్భ జలం సరాసరి 7.26 మీటర్ల లోతులో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో 2.18 మీటర్ల పైన పాతాళ గంగ ఉంది. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభం జూన్లో వర్షాల ప్రభావం అంతగా లేదు. దీంతో పంటలను సాగు చేసేందుకు అన్నదాతలు ఆలోచనలో పడ్డారు. జులై మొదటివారానికి వచ్చేసరికి మాత్రం కుంభవృష్టి కురవడంతో జిల్లావ్యాప్తంగా బావులు, బోరుబావుల్లో నీటి మట్టాలు పెరిగిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో భూగర్భ జలాలు పెరిగిపోయాయి.
సంరక్షించుకోవాలి
ప్రస్తుతం నీటి నిల్వలను గమనిస్తే జిల్లాలో కాస్త ఫర్వాలేదనే కోణంలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. యాసంగి పంటలకు సరిపడా నీరుంది కదా అని అవసరానికి మించి వినియోగించడంతో వచ్చే వేసవి వరకు తీవ్ర స్థాయిలో జలాలు అడుగంటే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు తక్కువ నీటి వినియోగమయ్యే ఆరుతడి పంటలను పండించేందుకు మొగ్గు చూపాలి. ప్రభుత్వం నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నందున ఇష్టానుసారంగా బోర్ల నుంచి నీటిని తోడేస్తున్నారు.
తక్కువ నీటి వినియోగం పంటలు వేయాలి
- శ్రీనివాసరావు, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి
జిల్లాలో ప్రతి నెలా భూగర్భ జలాల నిల్వలను అంచనా వేస్తుంటాం. ఈ యాసంగి పంటలకు సంబంధించి గతంతో పోలిస్తే వానాకాలంలో అధిక వర్షాలు కురవడంతో భూగర్భ జల మట్టాలు అమాంతం పెరిగిపోయాయి. నీటిని ఇష్టారీతిన వినియోగించకుండా యాసంగిలో ఆరుతడి పంటలను వేయడంతో పాటు ప్రతి రైతు పంట భూముల్లో పాంపాండ్స్, చెక్డ్యాంలు నిర్మించుకోవాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు