సారూ.. ఓరుగల్లు కోరుతోంది..!
ఓరుగల్లు నగరాభివృద్ధికి అనేక అడుగులు పడాల్సి ఉంది. నగరం రూపురేఖలు మార్చి ప్రజలకు స్మార్ట్ సేవలను చేరువ చేసేందుకు అమలవుతున్న ‘ఆకర్షణీయ పథకం’ (స్మార్ట్ సిటీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
ఈనాడు, వరంగల్, కార్పొరేషన్, న్యూస్టుడే
ఓరుగల్లు నగరాభివృద్ధికి అనేక అడుగులు పడాల్సి ఉంది. నగరం రూపురేఖలు మార్చి ప్రజలకు స్మార్ట్ సేవలను చేరువ చేసేందుకు అమలవుతున్న ‘ఆకర్షణీయ పథకం’ (స్మార్ట్ సిటీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మంగళవారం పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కమలాపూర్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. జిల్లాకు మంత్రి వస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.
పర్యటన సాగుతుందిలా....
* ఉదయం 11 గంటలు: కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో కమలాపూర్ మండలం గూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని హెలిప్యాడ్ స్థలానికి చేరుకుంటారు.
* 11 నుంచి 12 వరకు: రూ.2.71 కోట్లతో నిర్మించే కమలాపూర్ బస్టాండ్ నిర్మాణానికి, కుల సంఘాల కమ్యూనిటీ భవనాల సముదాయానికి శంకుస్థాపన, పెద్దమ్మగుడి, మార్కండేయ గుడి, శంకుస్థాపన చేస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు: వివిధ కుల సంఘాలకు ఒకే దగ్గర నిర్మాణం చేపట్టిన కుల సంఘాల కమ్యూనిటీ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
* 12.30 నుంచి 2 వరకు: మహాత్మా జ్యోతిబా ఫులే బాలబాలికల గురుకుల పాఠశాలల భవనాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం చేస్తారు.
* 2 గంటల తరువాత..కమలాపూర్ నుంచి రహదారి మార్గం గుండా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్తారు.
న్యూస్టుడే, కమలాపూర్
రెండేళ్లు గడిచినా
ఓరుగల్లు నగరంలో అమృత్ పథకాన్ని రూ.610 కోట్లతో చేపట్టారు. ఈ పథకాన్ని మిషన్ భగీరథకు అనుసంధానించి 2021 ఉగాది నుంచి నగరంలో ప్రతి రోజూ తాగునీటిని విడుదల చేస్తామని మహానగరపాలక సంస్థ ప్రకటించింది. తర్వాత కొన్ని రోజులు మాత్రమే తాగునీరు ప్రతి రోజూ సరఫరా చేశారు. తర్వాత రోజు విడిచి రోజు, అది కూడా సరఫరాలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని కాలనీలకు ఇప్పటికీ తాగు నీరు అందడం లేదు.
* ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసే అమృత్ పథకాన్ని 2021 ఏప్రిల్ 12న మంత్రి కేటీఆర్ రాంపూర్లో ప్రారంభించారు.
ఆకర్షణీయ నిధులు కావాలి
ఓరుగల్లుకు స్మార్ట్సిటీ పథకం 2016లో మంజూరైనా ఇప్పటికీ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ను మంత్రి ఆదేశించారు. ఇందులో రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం రూ.193 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తన వాటాను ఇచ్చి యుటిలైజేషన్ ధ్రువపత్రం సమర్పిస్తేనే తన మిగిలిన వాటా ఇస్తానని తెగేసి చెప్పింది.
* నగరంలో స్మార్ట్సిటీ కింద ప్రారంభించిన పద్మాక్షి గుట్ట రోడ్డు, వరంగల్లో 11 స్మార్ట్ రోడ్ల పనులు ఆగాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెంటనే విడుదలయ్యేలా మంత్రి చొరవ చూపాల్సి ఉంది.
* గతేడాది మే 7న వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు.
ఐటీ అంతంతే..
ప్రభుత్వం గతంలో ఓరుగల్లులో పలు ఐటీ కంపెనీలను ప్రారంభించింది. హైదరాబాద్లో హైటెక్స్ తరహాలో ‘వైటెక్స్’ పేరుతో పదెకరాల్లో మడికొండలో మూడు నక్షత్రాల హోటల్, సాంస్కృతిక కేంద్రం వస్తుందని ప్రభుత్వం జీవో సైతం విడుదల చేసింది. కానీ దీనిపై అడుగులు ముందుకు పడడం లేదు.
శంకుస్థాపనకే పరిమితం
నగర రద్దీ నియంత్రణకు వరప్రదాయని అయిన ఇన్నర్ రింగు రోడ్డు పూర్తికి అడుగులు పడడం లేదు. ‘కుడా’ రూ.126 కోట్లతో భూసేకరణకు సిద్ధమైంది. ఆరేపల్లి, కొత్తపేట, ఎనుమాముల మార్కెట్, ధర్మారం, స్తంభంపల్లి శివారు, ధూపకుంట శివారు నుంచి రంగశాయిపేట ఖమ్మం రోడ్డు వరకు ఇన్నర్ రింగు రోడ్డు చేపట్టాలి.
ఏవీ నియో పరుగులు?
కాజీపేట నుంచి వరంగల్ వరకు 15.5 కిలోమీటర్ల మేర రూ.998 కోట్లతో మెట్రో రైలుకు డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 2021 మార్చిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. కొన్ని మార్పులు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను మరోమారు పంపాలని తాము కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌషల్ కిశోర్ గత నెలలో రాజ్యసభలో ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ