ఘనంగా ఏర్పాట్లు.. పటిష్ఠ బందోబస్తు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలంలో పర్యటించనున్నారు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
కమలాపూర్, న్యూస్టుడే: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
గురుకుల భవన నిర్మాణం అద్భుతం
తెలంగాణ ఏర్పడక ముందు వెనుకబడిన కులాలకు ప్రభుత్వాలు విద్యను అందజేయలేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కమలాపూర్ మండలం గూడూరు శివారులోని మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే మహాత్మాజ్యోతిబా ఫులేె బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గురుకుల భవనాల కట్టడం అద్భుతంగా ఉందని, దీన్ని చూసి బీసీ మంత్రిగా తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందన్నారు. బీసీ సంక్షేమ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టుతో చరవాణిలో మాట్లాడుతూ తరగతి గదుల్లో డిజిటల్లో ఆన్లైన్ క్లాస్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్, భారాస నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్, ఎంజేపీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో రాంరెడ్డి, ఇంజినీరింగ్ ఈఈ నరేందర్ రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో పల్లవి, పీఏసీఎస్ ఛైర్మన్ సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.
సీపీ పరిశీలన..
గూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంతో పాటు అభివృద్ధి పనులు ప్రారంభించే స్థలాలను సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ.బారి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్తో కలిసి సీపీ రంగనాథ్ పరిశీలించారు. 300 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ.బొలిమల్ల సంజీవ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?