భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో..!
భూ సమస్యలను పరిష్కరించాలని కొందరు. అర్హులైన తమకు ఆసరా పింఛన్లు రావడం లేదని మరికొందరు. తమకు రక్షణ కల్పించాలని పలువురు. ఇలా అనేక సమస్యలు ప్రజావాణిలో వెల్లువెత్తాయి.
ప్రజావాణిలో అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూశాఖవే
ప్రజావాణిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
జనగామ అర్బన్, న్యూస్టుడే: భూ సమస్యలను పరిష్కరించాలని కొందరు. అర్హులైన తమకు ఆసరా పింఛన్లు రావడం లేదని మరికొందరు. తమకు రక్షణ కల్పించాలని పలువురు. ఇలా అనేక సమస్యలు ప్రజావాణిలో వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 55 దరఖాస్తులు రాగా రెవెన్యూశాఖవే 38 ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు కలుగుతుందోనని బాధితులు ఎదురుచూస్తున్నారు. మీదికొండ రైతులు ఏకంగా భూఅక్రమణల పై విచారణ చేపట్టాలని రైతులు బ్యానర్ను ప్రదర్శించి ఆవేదన తెలిపారు.
బతికే ఉన్నా..ఆసరాలో చంపేశారు
ఈయన పేరు ఓరుగంటి సూర్యనారాయణ. జనగామ పట్టణానికి చెందిన ఈయన అక్టోబర్ 11, 2021న వృద్ధాప్య పింఛన్ కోసం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఆగస్టు నెలలో విడుదల చేసిన జాబితాలో ఈయన పేరు లేకపోవడంతో సంబంధిత అధికారులను ఆరా తీశారు. అతను మృతిచెందినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో ఆసరా పింఛన్కు దూరమయ్యాడు. రికార్డుల్లో తప్పుదొర్లిన దానిని సవరించాలంటూ గతంలో ప్రజావాణిలో విన్నవించినా పరిష్కారం జరగకపోవడంతో సోమవారం మరోమారు కలెక్టర్ను కలిశారు.
గ్రామసభలో ఉందన్నారు.. జాబితాలో తొలగించారు
ఈ చిత్రంలోని దంపతులు గోరంట్ల కుమారస్వామి, శోభ. వీరిది చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామం. రెండు పడకల ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందని పలుమార్లు గ్రామసభలో చెప్పిన అధికారులు ప్రస్తుత జాబితాలో పేరు లేకపోవడంతో కలెక్టర్ను ఆశ్రయించారు. దివ్యాంగుడైన గోరంట్ల కుమారస్వామి పింఛన్ కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కావడం లేదని వాపోయారు. నిరుపేదలమైన తమకు రెండు పడకల ఇళ్లు, ఆసరా పింఛన్ ఇప్పించాలంటూ మొర పెట్టుకున్నారు.
రక్షణ కల్పించాలని..
తమకు రక్షణ కల్పించి..తమ భూమి ఇతరుల వశం కాకుండా చూడాలంటూ దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన దండు మంజుల తన ముగ్గురు పిల్లలతో కలిసి ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, మధ్యవర్తులు తన భర్తను ప్రలోభాలకు గురిచేసి, తాగుడుకు బానిసను చేసి మాకు తెలియకుండా మోసపూరితంగా ఆయన పేరు మీదున్న కోట్ల విలువ చేసే 10 గుంటల భూమిని ధరణి పోర్టల్లో స్లాట్బుక్ చేసి అక్రమంగా భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. తమపై తీవ్రంగా దాడులు చేస్తున్నారని, రక్షణ కల్పించి..తమ భూమి అక్రమార్కుల వశం కాకుండా చూడాలని వేడుకున్నారు.
విచారణ చేసి న్యాయం చేయండి..
వీరు స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలోని రైతులు. గ్రామ శివారులోని సర్వే.నెం:360లో సాగునీటి కాలువ నిర్మాణం కోసం పది మంది రైతులకు చెందిన 1.20 ఎకరాల భూమి కాలువ కింద వదులుకోవాల్సి వచ్చింది. వీరందరికి నష్టపరిహారం రావాల్సి ఉండగా ముగ్గురికే వచ్చింది మిగతా వారికి వచ్చేలా చూడాలని కోరారు. గతంలో ఐదు సార్లు మొర పెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. గ్రామంలోని అక్రమణల పై విచారణ చేపట్టాలని వారు కోరారు.
శ్మశానవాటిక భూమిని కాపాడండి..
జనగామ అర్బన్, న్యూస్టుడే: ఆక్రమణకు గురవుతున్న జనగామ జిల్లా పెంబర్తిలోని 2.14 ఎకరాల శ్మశానవాటిక భూమిని కాపాడాలంటూ ముస్లిం యువకులు కలెక్టరేట్లో నిరసన తెలిపారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్మశానవాటిక భూమిని సర్వే చేయించి హద్దులు చూపించాలని తెలిపారు. వైకుంఠధామాల మాదిరిగానే ముస్లీంల శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహ్మద్ ఇబ్రహీం, మసిహుర్ రెహమాన్, జాకీర్ పటేల్, యాకూబ్ పాషా, ఇస్మాయిల్, జహీర్, ఖలీల్, జాంగీర్, హైమద్ పాల్గొన్నారు.
శాఖల వారీగా దరఖాస్తులు ఇలా..
ఆర్డీవోల పరిధిలోనివి : 6
తహసీల్దార్ల పరిధిలోనివి : 29
ఏడీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ : 3
కలెక్టరేట్ ఏవో: 2, డీఆర్డీవో: 4
ఎస్సీ సంక్షేమశాఖ : 5
విద్యుత్శాఖ ఎస్ఈ : 2
ఇతర శాఖలవి : 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి