రహదారి.. ప్రమాదాల దరి!
గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏడు నెలలు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో వ్యయప్రయాసల మధ్య రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు
జాదరావుపేట, ఒడిపిలవంచ మధ్య కోతకు గురైన రోడ్డు
కాటారం, న్యూస్టుడే: గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏడు నెలలు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో వ్యయప్రయాసల మధ్య రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు గ్రామాలకు వెళ్లేందుకు ఒకే రోడ్డు మార్గం కావడంతో తప్పని పరిస్థితిలో గ్రామస్థులు ఈ దారుల నుంచే వెళ్లాల్సి వస్తోంది.. కాటారం మండలంలో 24 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దామెరకుంట, జాదరావుపేట రోడ్డు మార్గం గత వర్షాకాలంలో పూర్తిగా దెబ్బతింది. పలు గ్రామాల ప్రజలు ఇబ్బందికరంగానే ప్రయాణం కొనసాగిస్తున్నారు. రెండు గ్రామాల మధ్య దాదాపు 2 కి.మీ మేర రోడ్డంతా కొట్టుకుపోయింది. కంకర రాళ్లు బయటకు వచ్చాయి. వాహనాలు ఇటువైపుగా వెళ్లాలంటే ఆవస్థలు పడుతున్నారు. జాదరావుపేట, ఒడిపిలవంచ గ్రామాల మధ్యలో సగానికి పైగా రోడ్డు కోతకు గురై దర్శనమిస్తోంది. ఇటుగా వెళ్లే వాహనాలు పలుసార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. కోతకు గురైన చోట మట్టి పోయించి తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ వచ్చిన వానలతో మరోసారి రోడ్డు కోతకు గురికావడంతో ఇక చేసేదేమీ లేక ఆ రోడ్డు పైనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జాదరావుపేటకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పగా కాలు విరిగింది. ప్రతి 50 మీటర్లకు ఒక్క గుంత వాహనదారులకు స్వాగతం పలుకుతున్నాయి.
ప్రమాదాల బారిన పడుతున్నారు
- సుంకరి లక్ష్మయ్య, జాదరావుపేట
గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఇటువైపు వెళ్లే పలు వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. గ్రామం నుంచి కాటారానికి పాఠశాలలకు వెళ్లే బస్సులు ప్రమాదకరంగా పయనించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.
మరమ్మతులు చేపడుతాం..
- అవినాష్, ఏఈఈ, ఆర్అండ్బీ
తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాం. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. నెల రోజుల్లో పనులు ప్రారంభించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!