నిధులున్నా.. పనులు అంతంతే..
పేరుకే డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, రైల్వే కూడలి, మున్సిపాలిటీ. ఇన్ని హోదాలు కలిగిన చోట నేటికీ స్త్రీనిధి కార్యాలయానికి సొంత భవనం లేదు.
డోర్నకల్లో అసంపూర్తిగా ఉన్న స్త్రీనిధి భవనం
డోర్నకల్, న్యూస్టుడే: పేరుకే డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, రైల్వే కూడలి, మున్సిపాలిటీ. ఇన్ని హోదాలు కలిగిన చోట నేటికీ స్త్రీనిధి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో మహిళల అగచాట్లు వర్ణానతీతం. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్త్రీనిధి భవనం నిర్మాణం కోసమని ప్రభుత్వం రూ.25 లక్షలు కేటాయించింది. ఆరేళ్ల కిందట బొక్కలకొట్టు ప్రాంతంలో కట్టడం మొదలుపెట్టినా పనులు ఒక కొలిక్కి రాలేదు. పనులు పరిశీలించిన జిల్లా పాలనాధికారులు స్త్రీనిధి భవనాన్ని తక్షణం వాడకంలోకి తీసుకుని రావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కదలిక రాలేదు. సెర్ప్ ఏపీఎం మాలోతు శంకర్నాయక్ భవన అవసరాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రూ.5 లక్షలు మంజూరు చేశారు. డోర్నకల్లో 40 గ్రామైక్య సంఘాలకు తోడు 936 చిన్న సంఘాలుండగా 9956 మంది సభ్యులున్నారు. సొంత భవనం పూర్తి చేసి సత్వరం వినియోగం తీసుకుని రావాలని మహిళలు కోరుతున్నారు.
రక్షణ లేక బిక్కు బిక్కు
- చంద్రకళ, వెన్నారం
ప్రస్తుతమున్న అద్దె భవనంలో రక్షణ లేదు. వర్షమొస్తే పైకప్పు ఊరుస్తోంది. గ్రామైక్య సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుకు గాని వసతి లేదు. మండల పరిషత్తు కార్యాలయాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. ముఖ్యంగా అద్దె భవనం ఇటు ఆటోల అడ్డాలు, అటు బ్యాంకులకు అందుబాటులో లేదు. ఫలితంగా ప్రతి నిత్యం ప్రయాస తప్పడం లేదు.
మౌలిక వసతులు సమకూరుతాయి
- నాగమణి, మన్నెగూడెం
స్త్రీనిధికి సొంత భవనం ఉంటే మౌలిక వసతులు సమకూరుతాయి. ప్రభుత్వ పరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బంది ఉండదు. శిక్షణ పొందడానికి వేరొక చోటుకు వెళ్లాల్సిన అవసరం రాదు. అనుకూల వాతావరణం తోడుంటే విధి నిర్వహణ సజావుగా కొనసాగడమే కాదు మరింత సమర్ధవంతంగా పని చేసే వీలు కలుగుతుంది.
నెలలోపు నిర్మాణం పూర్తి
- మాలోతు శంకర్నాయక్, ఏపీఎం, సెర్ప్
డోర్నకల్లో స్త్రీనిధి భవనం నిర్మాణంలో జరుగుతున్న జాప్యం గురించి ఎమ్మెల్యే రెడ్యానాయక్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించి పనుల పూర్తికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా పనులు వేగవంతమయ్యాయి. అదనపు గది నిర్మాణానికి 2021-22 సీడీఎఫ్ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దీనికి గతేడాది సెప్టెంబర్ 24వ తేదీన భూమి పూజ చేశారు. నెలలోపు నిర్మాణం పూర్తి చేసి ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతుల మీదుగా భవనం ప్రారంభించి ప్రగతి మండల సమాఖ్యకు అందుబాటులోకి తీసుకొస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్