మేడారం జాతరొచ్చే.. వనమంతా జనమాయే..
భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం పరవశించింది.
సమ్మక్క అడేరాలను గద్దెల వద్దకు తీసుకొచ్చిన పూజారులు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, తాడ్వాయి, మంగపేట, న్యూస్టుడే: భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం పరవశించింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు.. శివసత్తుల పూనకాలు.. తీరొక్క మొక్కులు.. చంటి పాపలు మొదలుకొని ముదిమి వయసు వారితో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మేడారంలో బుధవారం మండమెలిగే పండగ(చిన్న జాతర) ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రాకతో వనం జనమయమైంది.
ఆలయ శుద్ధి.. ద్వారబంధనాలతో ఆరంభం
గిరిజన ఆదివాసీ సంప్రదాయాలతో వేడుక ఆరంభమైంది. మేడారంలో సిద్ధబోయిన, కొక్కెర, చందా వంశీయులు, కన్నెపల్లిలో కాక వంశీయులు ఉదయాన్నే అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని గుట్ట నుంచి గడ్డి, అడవుల నుంచి పుట్ట మట్టిని తీసుకొచ్చారు. పూజారులు సంప్రదాయ తెల్లని వస్త్రాలు ధరించి సిద్ధబోయిన ముణీందర్ ఇంటి వద్ద సమావేశమయ్యారు. పండగ నిర్వహణపై చర్చించుకున్నారు. అక్కడి నుంచి పూజారులు, వారి ఆడపడుచులు డోలి వాయిధ్యాలతో ఆలయాలకు చేరుకున్నారు. ఆడపడుచులు గుడిలో అలికి ముగ్గులు వేశారు. అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బొడ్రాయి, పోచమ్మ, తదితర గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దుష్ట శక్తులు దరి చేరకుండా తూర్పు పడమరన దిష్టితోరణాలను కట్టారు. ఈ క్రతువును చూసేందుకు భక్తులు తరలివచ్చారు. అనంతరం ఊరట్టంలోని మాజీ ఎమ్మెల్యే చర్ప భోజరావు కుటుంబీకులు సమర్పించిన చల్లపెయ్యను ఊరేగింపుగా డోలివాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకొచ్చారు.
గద్దెల వద్ద రహస్య పూజలు.. జాగరణ..
చల్లపెయ్యను ఆలయానికి తీసుకొచ్చిన అనంతరం ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుని రాత్రి నిర్వహించే పూజా కార్యక్రమాల సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. రాత్రి మేడారం నుంచి సమ్మక్క, కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజాసామగ్రితో తరలివచ్చారు. పూజారులు గద్దెలకు చేరే క్రమంలో భక్తులు పెద్దఎత్తున జై సమ్మక్క తల్లీ, జై సారలమ్మ తల్లీ అంటూ వారికి స్వాగతం పలికారు. గద్దెలకు చేరుకోగానే.. విద్యుత్తు దీపాలను ఆర్పి రహస్య పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఘనమైన చరిత్రను వంశస్థులకు ఉపదేశించారు. రాత్రంతా జాగరణ చేశారు.
కుటుంబ సమేతంగా మొక్కులు
చిన్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టంక్రాస్ తదితర ప్రాంతాల్లో భక్తులు విడిది చేశారు.
భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం
ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడారం చిన్న జాతర నిర్వహణ కోసం రూ. 3.10 కోట్లను ఖర్చు చేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్, ఓఎస్డీ అశోక్ కుమార్, గ్రంథాలయ ఛైర్మన్ గోవింద్నాయక్ తదితరులతో కలిసి ఆమె బుధవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటి వరకు మేడారం అభివృద్ధికి, జాతరల నిర్వహణకు రూ. 400 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఏర్పాట్లు బాగున్నాయని ఎస్పీ, పీఓను ఆమె అభినందించారు. మేడారం సర్పంచి చిడం బాబురావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్కకు మొక్కులు సమర్పిస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య