విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట
భూమిపై ప్రాణికోటి మనుగడకు పంచభూతాలు ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్తో పాఠశాలను ప్రారంభింపజేస్తున్న
మంత్రి సత్యవతి రాథోడ్, పక్కన కలెక్టర్ కృష్ణఆదిత్య, పీఓ అంకిత్
గోవిందరావుపేట, న్యూస్టుడే: భూమిపై ప్రాణికోటి మనుగడకు పంచభూతాలు ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 50 లక్షల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దిన గోవిందరావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణఆదిత్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏ ప్రాంత అభివృద్ధికైనా విద్యే తొలిమెట్టుగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 36 వేల పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దేందుకు రూ. 7200 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ రంగంలోనే విద్యాబోధన జరగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ను ఆమె అభినందించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు సహాయ, సహకారాలను అందించాలన్నారు. తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ గౌష్ ఆలం, జిల్లా విద్యాశాఖాధికారి పాణిని, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పి.గోవిందునాయక్, ఎంపీపీ ఎస్.శ్రీనివాసరెడ్డి, సర్పంచి ఎల్.లక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు ఎ.శ్రీనివాసరావు, జి.ఏడుకొండలు, కోఆప్షన్ సభ్యుడు ఎండీ.బాబర్, ఎంఈఓ జి.దివాకర్, ప్రధానోపాధ్యాయులు కె.రఘురాం, కె.జ్యోతి పాల్గొన్నారు.
గోవిందరాజు దర్శనం
ఏటూరునాగారం: మండలంలోని కొండాయి, దొడ్ల గ్రామాల్లో కొలువుదీరిన వనదేవతలను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవింద్నాయక్, కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ గౌష్ఆలం, ఏఎస్పీ సంకీర్త్ దర్శించుకున్నారు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, దబ్బకట్ల గోవర్ధన్, దబ్బకట్ల జనార్ధన్ తదితరులు స్వాగతం పలికి దర్శనం చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!