logo

బాధ్యతలు స్వీకరించిన పాలనాధికారి సిక్తా పట్నాయక్‌

హనుమకొండ జిల్లా నూతన పాలనాధికారిగా సిక్తా పట్నాయక్‌ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

Published : 02 Feb 2023 05:38 IST

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా నూతన పాలనాధికారిగా సిక్తా పట్నాయక్‌ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఐఏఎస్‌ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఉత్తర్వులు అందుకున్న ఆమె పిల్లలతో కలిసి ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ నుంచి హనుమకొండలోని హరిత హోటల్‌కు వచ్చారు. డీఆర్‌వో వాసుచంద్ర, పరకాల ఆర్‌డీవో రాము, హనుమకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌, సమాచార శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణ్‌.. పాలనాధికారికి స్వాగతం పలికారు. అక్కడే బాధ్యతలు స్వీకరించారు. రాత్రి హరిత హోటల్‌లో బస చేశారు. గురువారం కలెక్టరేట్‌కు  వచ్చి విధుల్లో చేరనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని