రైతులకు రెట్టింపు.. సీసీ ఛార్జీల వడ్డింపు
రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది.
ఏడాదికి రూ.320కి బదులుగా ఒక్కోచోట ఒక్కో రకంగా..
రూ.750 వసూలు..రశీదు
జనగామ, నర్సంపేట, న్యూస్టుడే: రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది. సరఫరా నిర్వహణలో భాగంగా వినియోగదారు రుసుము (కస్టమర్ ఛార్జీ) పేరిట రైతులు నెలకు రూ.30 చొప్పున ఏకమొత్తంగా ఏడాదికి రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పెంపు ఆదేశాలు లేకున్నా నాలుగేళ్లుగా దీనికి రెట్టింపు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఉత్తర్వులు లేవు.. వసూళ్లు ఉన్నాయ్
ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతుల నుంచి ఏటా డిసెంబరు మొదటి వారం నుంచి చివరి వారంలోపు సీసీ రుసుము తీసుకుంటారు. వ్యవసాయ సర్వీసుల సంఖ్యకు అనుగుణంగా సీసీ రుసుము లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీంతో 2018 నుంచి క్రమం తప్పకుండా చెల్లించే రైతుల నుంచే రెట్టింపు వసూలు చేస్తున్నామని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇది కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు.. నిర్ధేశిత మొత్తానికి మించి వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్తు శాఖ ఎస్ఈలు, డీఈలు అంటున్నారు. పెంపుదలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవని అంగీకరిస్తున్నారు.
ఉదాహరణలు ఇవిగో..
జనగామ జిల్లాలో అన్ని చోట్ల రైతుల నుంచి ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. రఘునాథపల్లి మండలంలో ఓ గ్రామంలో గతేడాది రూ.360 చొప్పున వసూలు చేశారు. లింగాలఘన్పూర్ మండలం వనపర్తిలో ఓదఫా రూ.750 తీసుకున్నారు. తమ గ్రామాల్లో ఏటా రూ.750 వసూలు చేస్తున్నారని జఫర్గఢ్కు చెందిన వేములయ్య అనే రైతు, స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన ముక్కెర మధు తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల ఏసురత్నం అనే రైతు తమ ప్రాంతంలో రూ.500 చెల్లిస్తున్నట్లు చెప్పారు.
ఒక రైతు పరంగా చూస్తే ఇది రూ.వందల్లోనే కనిపిస్తుంది. ఒక ఊరు, ఒక జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే రూ.కోట్ల మేర అదనపు భారం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఏటా సీసీ ఛార్జీల రూపేణా రూ.16.20 కోట్లు వసూలు కావాలి. రూ.720 చొప్పున వసూలు చేస్తే రైతులపై అదనంగా మరో రూ.16 కోట్ల భారం పడుతుంది.
మూడేళ్లుగా చెల్లిస్తున్నా
- గుండె గోపాల్రావు, లెంకాలపల్లి, నల్లబెల్లి మండలం
మా కుటుంబంలో మూడు వ్యవసాయ కనెక్షన్లుండగా నిరుడు ఒక్కో దానికి రూ.600 చొప్పున రూ.1800 చెల్లించాను. ఈ ఏడాది అంతే మొత్తం చెల్లించాను విద్యుత్తు అధికారులు మూడేళ్లుగా ఇలాగే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక్కో మోటారుకు ఏడాదికి రూ.360లే కదా అని అడిగితే పెరిగాయని చెప్పారు. నిజమే కావొచ్చని వారడిగినంత చెల్లించి రశీదు తీసుకుంటున్నా.
సరఫరా నిలిపివేస్తున్నారు..
- ఐరెడ్డి జితేందర్రెడ్డి, బానోజిపేట, నర్సంపేట మండలం
ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న మాట సరికాదు. మాకు రెండు వ్యవసాయ మోటార్లున్నాయి. సర్వీసు ఛార్జీ కింద సంవత్సరానికి రూ.360 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అధికారులు మాత్రం రూ.600 వసూలు చేస్తున్నారు. బిల్లుల వసూళ్ల కోసం పంటల సీజన్లో కరెంటు సరఫరాను నిలిపి వేస్తున్నారు.
* ఎన్పీడీసీఎల్ సీజీఎం(ఫైనాన్స్) తిరుపతిరెడ్డిని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు, నిబంధనలు లేవన్నారు. ఎస్ఈ వేణుమాధవ్తో గ్రూప్కాల్ ద్వారా మాట్లాడారు. రైతులు అదనంగా చెల్లిస్తే వారికే చెందుతుందని ఆయన వివరించారు.
* ‘ఉన్నతాధికారుల వద్ద ఎక్కువ బిల్లు వసూళ్ల విషయాన్ని ప్రస్తావిస్తే.. బలవంతం చేయడం లేదని అడిగితే వారే స్వచ్చందంగా చెల్లిస్తున్నారని జిల్లా ఎస్ఈ మధుసూదన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని