ఆగిన చోటే.. అడుగేసి
వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాద యాత్ర వరంగల్ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది.
ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల
ఈనాడు, వరంగల్, చెన్నారావుపేట, నెక్కొండ, న్యూస్టుడే: వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాద యాత్ర వరంగల్ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది. గురువారం హైదరాబాద్ లోటస్పాండ్ నుంచి బయలుదేరిన షర్మిల సాయంత్రం 4 గంటలకు వైతెపా ముఖ్య నేతలతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అక్కడే తన వెంట తెచ్చిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. నవంబరు 28న.. 223వ రోజు షర్మిల పాదయాత్రను భారాస నేతలు అడ్డుకోవడంతో యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. తర్వాత యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రెండు నెలలకు పైగా బ్రేక్ పడింది. యాత్రకు అనుమతి కోసం షర్మిల న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందారు. సుదీర్ఘ విరామం తర్వాత గురువారం 224వ రోజు యాత్ర ప్రారంభమైంది.
భారీ బందోబస్తు..
ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా వరంగల్ పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఈస్ట్జోన్ డీసీపీ, ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతోపాటు మొత్తం వంద మంది పోలీసు సిబ్బంది యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. యాత్ర గురువారం రాత్రి వరకు నెక్కొండ మండల కేంద్రానికి చేరుకొంది. లింగగిరి క్రాస్ వద్ద షర్మిల వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పిస్తూ ప్రసంగించారు. అనంతరం నెక్కొండ మండల కేంద్రంలో ‘మాటా ముచ్చట’ పేరుతో ప్రజలతో సంభాషించారు.
ఏదీ బంగారు తెలంగాణ?
నెక్కొండ మాటా ముచ్చటలో షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్పై పదునైన విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేశారన్నారు. ఎనిమిదిన్నరేళ్లలో ప్రతిపక్షాలు ప్రజల కోసం కేసీఆర్ను ఎదురించి మాట్లాడలేదని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలకు ఇబ్బందులే తప్ప లాభాలు లేవన్నారు. తెలంగాణ ప్రజల కోసమే నా కుటుంబాన్ని పిల్లల్ని వదిలి పెట్టి వచ్చానని షర్మిల అన్నారు. పాదయాత్రలో వైతెపా నేతలు శాంతికుమార్, రాజశేఖర్, వెంకన్న, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళకు సన్మానం..
నెక్కొండ, చెన్నారావుపేట, న్యూస్టుడే: గతేడాది నవంబర్ 28 షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను భారాస నేతలు అడ్డుకున్నారు. లింగగిరి క్రాస్రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు దహనం చేయడానికి ప్రయత్నించారు. లింగగిరికి చెందిన పులి మంజుల వారిని అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు పోయడంతో విగ్రహం అంటుకోగా ఆమెతో పాటు మరికొందరు మహిళలు నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. గురువారం పునఃప్రారంభమైన పాదయాత్రలో భాగంగా లింగగిరి క్రాస్రోడ్డుకు చేరుకున్న షర్మిల మంజులను శాలువాతో సన్మానించారు.
నెక్కొండలో పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?