పొదుపు మంత్రం పాటిద్దాం!
సోమవారం నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నల్లా నీళ్లపైన ఆధారపడిన ప్రజలు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే.
రేపటి నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిపివేత
న్యూస్టుడే, కార్పొరేషన్: సోమవారం నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నల్లా నీళ్లపైన ఆధారపడిన ప్రజలు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆదివారం సరఫరా చేసే తాగునీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంతగా సమస్య నుంచి బయటపడతారు. వృథా చేయకుండా కేవలం తాగేందుకు, వంటకు ఉపయోగించుకోవాలి. నగరంలోని 50 డివిజన్లలో 7.5 లక్షల మందికి ఎదురు కానున్న తాగునీటి సమస్య నుంచి గట్టెక్కాలంటే నీటి పొదుపు తప్పనిసరి అని గుర్తించాలి.
ధర్మసాగర్ చెరువు నుంచి వరంగల్ నగరానికి వచ్చే 2100 ఎంఎం డయా ప్రధాన పైపులైన్ పైన కొత్తగా మూడు బట్టర్ ఫ్లై వాల్వ్లు ఏర్పాటు చేశారు. ఐదారేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రెండు పాత వాల్వ్లు దెబ్బతిన్నాయి. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా కొత్తగా మూడు బట్టర్ ఫ్లై వాల్వ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఈఎన్సీ సూచించారు. ఇందులో భాగంగా మున్సిపల్ పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పనులు ప్రారంభం కానున్నాయి. ధర్మసాగర్ నుంచి వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట తాగునీటి శుద్ధీకరణ కేంద్రాలకు రా వాటర్ విడుదల పూర్తిగా నిలిచిపోనుంది. మూడు ఫిల్టర్బెడ్లలో నీటిశుద్దీకరణ ఆగిపోనుంది. వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్లలో 50 డివిజన్లు, సుమారు 7.50 లక్షల మందికి సోమ, మంగళ, బుధవారాల్లో తాగునీటి సరఫరా ఉండదు. కేవలం అండర్ రైల్వేగేటు జోన్ పరిధిలో యధావిధిగా నీటి సరఫరా ఉంటుందని గ్రేటర్ వరంగల్ నీటి సరఫరా విభాగం ఈఈ బీఎల్.శ్రీనివాస్రావు తెలిపారు. మూడు రోజుల అంతరాయానికి నగర ప్రజలు సహకరించాలని కోరారు.
ఇలా చేయండి..
* ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా ఉంటుంది.
* నల్లా నీళ్లను ప్లాస్టిక్ డ్రమ్ములు, పెద్ద గిన్నెలు, బిందెల్లో అదనంగా నిల్వ చేసుకోవాలి.
* దుమ్ము ధూళి పడకుండా వీటిపైన మూతలు లేదా వస్త్రం కప్పాలి.
* కుళాయి వాటర్ సంప్లుంటే నిల్వ చేసుకోవాలి.
* తాగేందుకు, వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలి.
* దుస్తులు ఉతకడం, మొక్కలు, చెట్లకు నీళ్లు పట్టడానికి ఇతర వనరులను వినియోగించుకోవాలి.
* స్నానం, మరుగుదొడ్ల వినియోగం, ఇతర అవసరాలకు బోర్, చేతి పంపు నీళ్లను వాడుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్