రిజిస్ట్రేషన్లకు ఇంటి పన్ను రశీదు చాలు!
గ్రేటర్ వరంగల్ పరిధిలో నెల రోజులుగా నిలిచిపోయిన చరాస్తుల రిజిస్ట్రేషన్ల వివాదం కొలిక్కి వచ్చింది.
కార్పొరేషన్, న్యూస్టుడే: గ్రేటర్ వరంగల్ పరిధిలో నెల రోజులుగా నిలిచిపోయిన చరాస్తుల రిజిస్ట్రేషన్ల వివాదం కొలిక్కి వచ్చింది. కొత్త పురపాలక చట్టం-2019 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలో ఇంటి పన్ను చెల్లించిన రశీదు ఆధారంగా చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఈ విధానాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో అమలుపరచాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖాధికారులను కమిషనర్ ప్రావీణ్య కోరారు. శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘సాంకేతిక సమస్య..స్తంభించిన పాలన’ కథనంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో కమిషనర్ మాట్లాడారు. ఇక నుంచి ఓనర్షిప్, అసెస్మెంటు కాపీ, నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయరని, చరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఇంటిపన్ను రశీదు ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. బల్దియా ఇ-ఆఫీస్ విధానం ఎత్తివేశామని, డేటా మొత్తం సీజీజీలోకి అప్లోడ్ చేశారని, కొన్ని రోజులు సాంకేతిక కారణాలు వచ్చాయని, ఇక నుంచి అన్ని సక్రమంగా ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. మైగ్రేషన్తో క్షేత్రస్థాయిలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తక్షణమే సంబంధిత అధికారులు హైదరాబాద్లోని సీజీజీ ప్రతినిధులతో మాట్లాడాలని ఆదేశించారు.
ధ్రువీకరణ పత్రాలుండవు
గతంలో మాదిరిగా ఓనర్షిప్, అసెస్మెంటు కాపీలు, నో డ్యూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయరని బల్దియా కమిషనర్ ప్రావీణ్య స్పష్టత ఇచ్చారు. ఇంటి పన్ను చెల్లించే రశీదు ఆధారంగా యజమాని అని గుర్తించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇదే విధానం అమలవుతుందన్నారు. పాత భవనాల అసెస్మెంటు 1984, 1993 కాపీలు బల్దియా ప్రధాన కార్యాలయంలో రికార్డుల ఆధారంగా జారీ చేస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM