భయపడేది లేదు.. ప్రజల్లో తేల్చుకుందాం
చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతిపై మాట్లాడినందుకే భారాస నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే రమేష్కు వైఎస్ షర్మిల సవాల్
మాటా ముచ్చట కార్యక్రమంలో మాట్లాడుతున్న షర్మిల
పర్వతగిరి, న్యూస్టుడే: చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతిపై మాట్లాడినందుకే భారాస నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తమ వర్గీయులను దించారని మండిపడ్డారు. ఎవరికీ భయపడేది లేదని, విమర్శలు వాస్తవం కాకుంటే ప్రజల సమక్షంలో కూర్చొని తేల్చుకుందాం రండి అంటూ సవాలు విసిరారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామ శివారు జానకిపురం నుంచి శనివారం ప్రజా ప్రస్థాన పాదయాత్ర ప్రారంభించారు. అంతకు ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవడానికి భారాస శ్రేణులు కుట్రలకు పాల్పడుతున్నాయని.. కవరేజీ కోసం వచ్చిన మీడియాపైనా దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించడం, మంత్రి స్వగ్రామంలో కనీసం 24 గంటల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల లేకపోవడం, బిల్లులు రాక సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడడమే తప్పు అన్నట్లుగా మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులు తమ ప్లెక్సీలు, చింపి, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారాస నేతల ఆటలు ఇక సాగబోవని.. పాలన చాతకాక తమపై దాడులు చేయడానికి చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిన నూతన సచివాలయాన్ని పరిశీలించేందుకు అఖిలపక్షం నాయకులకు అనుమతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు భయమెందుకో అర్థం కావడం లేదని.. తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పర్వతగిరి, సంగెం మండలాల్లో పాదయాత్ర కొనసాగించారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు: సంగెం, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఉండగా నేడు ముఖ్యమంత్రి కేసీˆఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం పర్వతగిరి మండలం చౌటపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి సంగెం మండలం తీగరాజుపల్లి, గవిచర్ల, కాపులకనపర్తి గుంటూరుపల్లి మీదుగా పాదయాత్ర చేసి ఖిలావరంగల్ మండలం నక్కలపల్లి వద్ద రాత్రి విడిది చేశారు. కాపులకనపర్తి వద్ద షర్మిలక్కతో మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓటు విలువైందని మీ అమూల్యమైన ఓటును మాయమాటలకు మోసపోయి దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం స్థాపనే తన లక్ష్యమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..