రాజన్న పాలన తెస్తా.. మద్దతివ్వండి
పేదలందరికీ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వంటి పథకాలతో ప్రజలందరి గుండెల్లో దేవుడిగా నిలిచిన వైఎస్సార్ పాలనను ఆయన బిడ్డగా తీసుకొస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు.
ప్రజలకు అభివాదం చెబుతూ పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ షర్మిల
శివనగర్, న్యూస్టుడే: పేదలందరికీ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వంటి పథకాలతో ప్రజలందరి గుండెల్లో దేవుడిగా నిలిచిన వైఎస్సార్ పాలనను ఆయన బిడ్డగా తీసుకొస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర నిర్వహించారు. వరంగల్ ఫోర్టు రోడ్డు ఖిలావరంగల్ పెట్రోల్ పంపు కూడలిలో షర్మిలకు ప్రజలు స్వాగతం పలికారు. దారి పొడవునా షర్మిలను చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. ఫోర్డురోడ్డులోని సన్షైన్ ఆసుపత్రి డాక్టర్ నరేష్కుమార్ వైద్యసిబ్బంది షర్మిలకు స్వాగతం పలికి సత్కరించారు. వరంగల్ ఇసుకఅడ్డా కూడలిలో ఆ పార్టీ వరంగల్ తూర్పు కన్వీనర్ మల్యాల సుమిత్గుప్తా షర్మిలకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ గాడిదకు తెల్లరంగు వేసి ఆవు అని నమ్మిస్తారని ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికి ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పింఛన్లు, ఆరోగ్యశ్రీసేవలు అందిస్తామని, మహిళ పేరిట ఇళ్లు ఇస్తామన్నారు. బెల్టు షాపులను తొలగిస్తామన్నారు. ఇసుకఅడ్డా నుంచి రైల్వేగేటు ప్లైఓవర్ బట్టల బజార్ మీదుగా యాత్రసాగించారు.
అండర్ బ్రిడ్జి వైపు దారి మూసివేత
వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా వరంగల్ అండర్బ్రిడ్జి వైపు యాత్ర రాకుండా, బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు రాకుండా వన్వేలో మళ్లించారు. తూర్పు ఎమ్మెల్యే నివాసం ఉండటం వల్లనే యాత్ర ఆ దారిలో కొనసాగితే ఏదైనా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న భయంతో పోలీసులు ముందస్తుగా ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. దారి మళ్ల్లింపుతో అండర్బ్రిడ్జి దారిలో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM