ఇటు కమిటీ విచారణ.. అటు జీరో దందా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జీరో దందాను నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్ శాఖకు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, మరోవైపు కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగించారు.
మార్కెట్కు వచ్చిన మిర్చి
ఎనుమాముల మార్కెట్, న్యూస్టుడే: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జీరో దందాను నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్ శాఖకు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, మరోవైపు కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగించారు. ఇటీవల మార్కెట్లో నకిలీ తక్పట్టీలతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతున్న అంశంపై ‘ఈనాడు’లో వచ్చిన వరుస కథనాలకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ స్పందించి జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా బృందం మార్కెట్లో గేట్ ఎంట్రీలు, తక్పట్టీలు, బిడ్డింగ్ రిజిస్టరు, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తున్న సమయంలో ఆర్కే ఎంటర్ప్రైజెస్, జైగణేశ్ ట్రేడింగ్ అడ్తీదారులకు సంబంధించిన మిర్చిని భారత్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారి జీరో కాంటాలు నిర్వహిస్తూ దొరికిపోయారు. విచారణ కమిటీ అధికారి ప్రసాద్రావు ఆదేశాల మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ గ్రేడ్ 2 కార్యదర్శి, సహ కార్యదర్శి, మిర్చియార్డు సూపర్వైజర్కు మెమోలు జారీచేయడంతో పాటు సదరు వ్యాపారులను, దడవాయిని వారం పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మిర్చి యార్డు సూపర్వైజర్ నర్సింహ సెలవుల్లో వెళ్లిపోయారు.
తగ్గిన ఆదాయం
ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాల మిర్చి పంటను రైతులు మార్కెట్కు తీసుకొస్తారు. ఈ రెండు నెలల్లోనే మార్కెట్లో రూ.కోట్లలో జీరో దందా జరుగుతోంది. సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల ఆధారంగా వ్యాపారులు మార్కెటింగ్ శాఖకు సెస్, వాణిజ్య పన్నుల శాఖకు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్కు వస్తున్న పంట ఉత్పత్తుల మొత్తానికి పన్నుల వసూలు కావడం లేదు. సుమారు 30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తులను రికార్డుల్లో చేర్చకుండానే వ్యాపారులు బయటికి తరలిస్తున్నారు. దళారులకు మార్కెట్లోని కొంతమంది అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారు. జోరుగా జీరోదందా కొనసాగుతుండడంతో ఈ ఏడాది మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ.40 కోట్లు నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.25 కోట్ల మేర మాత్రమే సమకూరింది.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
-బి.వి.రాహుల్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి
మార్కెట్లో పంట ఉత్పత్తులను రికార్డు చేయకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై దృష్టిసారించాం. ఎలాంటి జీరో దందా జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం. గత వారంలో పంట ఉత్పత్తులను జీరోలో కొనుగోలు చేసిన వ్యాపారిని వారం పాటు మార్కెట్లో కొనుగోళ్లు చేయకుండా వేటు వేశాం. అప్రమత్తంగా లేని యార్డు అధికారులకు మెమోలు జారీచేశాం. ఎవరైనా జీరోదందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు