అక్రమ లేఅవుట్ల జోరు..
అనధికార లేఅవుటు స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని పురపాలక చట్టం 2019 చెబుతోంది. మరోవైపు ‘లేఅవుటు రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) భవిష్యత్తులో ఉండదని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చి చెప్పింది.
గ్రేటర్, పురపాలికల ఆదాయానికి గండి
న్యూస్టుడే, కార్పొరేషన్, హసన్పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు
వరంగల్ శివారులో అక్రమ లేఅవుటు హద్దురాళ్ల తొలగింపు
అనధికార లేఅవుటు స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని పురపాలక చట్టం 2019 చెబుతోంది. మరోవైపు ‘లేఅవుటు రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) భవిష్యత్తులో ఉండదని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చి చెప్పింది. అయినా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో విచ్ఛలవిడిగా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్ వరంగల్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా), ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంస్థల ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వీటి వెనుక రాజకీయ అండదండలుండటంతో టౌన్ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు.
వ్యాపారుల నయా దందా
* గ్రేటర్, ‘కుడా’ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు(రియాల్టర్లు) చాలా తెలివిగా ప్లాట్లు అమ్ముతున్నారు. అనధికార లేఅవుట్ల కోసం ఎకరాల చొప్పున భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ శాఖాధికారులకు ముడుపులు ముట్టజెప్పి గుంటల చొప్పున స్థలాలు అమ్ముతున్నారు. గతేడాది నుంచి నయా దందా మొదలు పెట్టారు. గుంటల చొప్పున అమ్మితే వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. తర్వాత భవన నిర్మాణ అనుమతులకు వాడుతున్నారు.
* వరంగల్ నగర పరిధిలోని విలీన గ్రామాల్లో ఎక్కువగా చిన్న చితక లేఅవుట్లు చేస్తున్నారు. అనుమతులు పొందకుండానే మూడో కంటికి తెలియకుండా స్థలాలు అమ్మేస్తున్నారు. వసంతపూర్, దూపకుంట, బొల్లికుంట, సింగారం, నక్కలపెల్లి, గాడిపెల్లి, స్తంభంపెల్లి, ధర్మారం, గొర్రెకుంట, పోతరాజుపల్లి, కొత్తపేట, పైడిపల్లి, ఆరెపల్లి, నాగారం, హసన్పర్తి, ఎల్లాపూర్, దేవన్నపేట శివారు, మడికొండ శివారు, భట్టుపల్లి, కడిపికొండ, తరాలపల్లి, తిమ్మాపూర్ విలీన గ్రామాల్లో అక్రమ లేఅవుట్ల జోరు ఎక్కువగా ఉంది.
హసన్పర్తి మండలం ముచ్చర్లలో ప్రభుత్వ శిఖం భూమిలోనే అక్రమంగా వెలిసిన వెంచర్
* ‘కుడా’ పరిధిలోని కమలాపూర్, ఎల్కతుర్తి, హుజురాబాద్ శివారు, స్టేషన్ఘన్పూర్, రఘునాథ్పల్లి, చిల్పూరుగుట్ట, ధర్మసాగర్, వర్దన్నపేట, ఐనవవోలు, గీసుకొండ మండల శివారుల్లో ఇదే విధానం ఉంటోంది.
* పున్నేలులో 20 ఎకరాలు, పంథినిలో 35, ఐనవోలులో 40, సింగారంలో 36 ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఉన్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో సర్వే నంబర్లు సరిచూసుకొని కొనుగోలు చేయాలని, లేకుంటే మోసపోతారని స్థానికులు పేర్కొంటున్నారు.
* హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో చెరువు శిఖం భూమినే పలువురు రియల్టర్లు అధికారుల అండతో కబ్జా చేసి ఆ భూమిలోనే వెంచర్ వ్యాపారానికి తెర లేపారు. చుట్టూ ప్రహరీని నిర్మించి తక్కువ ధరకే స్థలం అంటూ ప్రచారం చేపట్టారు.
* హసన్పర్తి మండలం నాగారం పెద్ద చెరువు సమీపంలో పలువురు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ పేరుతో భూదందా సాగిస్తున్నారు.
* హసన్పర్తి మండలం పెంబర్తిలో రియల్టర్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నారు.
నిబంధనలు ఇలా
* లేఅవుటు అనుమతులు పొందాలంటే ఆ స్థలంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు స్తంభాలు, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించాలి.
* ‘నాలా’ పేరుమార్పిడి, డెవలప్మెంటు ఛార్జీలు చెల్లించాలి. ప్రజల అవసరాల కోసం 10 శాతం ఖాళీ స్థలాన్ని కేటాయించాలి.
* గ్రేటర్, పురపాలికలకు లేఅవుటు అనుమతుల రుసుములు ఒక ఎకరానికి సుమారు రూ.15-20 లక్షలు ఉంటుంది.
* జిల్లా కలెక్టర్లు లేఅవుటు అనుమతులు జారీ చేస్తారు. స్థానిక సంస్థల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు.
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని పాత పాలకేంద్రానికి చెందిన సుమారు ఆరెకరాల భూమిని ఇటీవల కొందరు కొనుగోలు చేశారు. పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండానే భూమిని ప్లాట్లుగా విభజించడంతో పాటు, రోడ్లు ఇతర పనులు చేపట్టారు. ఈ విషయమై ఎంపీడీవో రాజలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రామారావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. సంబంధిత భూమికి ఎటువంటి అనుమతులు రాలేదని తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు నమోదైనట్లు చెప్పారు.
అక్రమ లేఅవుటు ప్లాట్లతో నష్టాలు
* భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు.
* అక్రమ లేఅవుట్లో కొనుగోలు చేసిన స్థలానికి ఒకవేళ టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి పొందాలంటే ఖాళీ స్థలం పన్ను (షాటు ఫాల్ ఆఫ్ ఓపెన్ ప్లేస్), ఫీనలైజేషన్ పన్ను, సర్ఛార్జీ పన్నులు చెల్లించాలి. ఇది మొత్తం రూ.లక్షల్లో ఉంటుంది.
* బ్యాంకుల ద్వారా రుణం లభించదు.
* భవిష్యత్తులో స్థలాలపై న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి
* ఆక్రమణలకు అవకాశం ఉంటుంది.
* రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు స్తంభాలు, ఇతర మౌలిక వసతులు ఉండవు
ఎలా గుర్తించాలి
* కొంత మంది స్థిరాస్తి వ్యాపారులు లేఅవుటు అనుమతులున్నాయని వినియోగదారులను మోసం చేస్తున్నారు.
* లేఅవుటు అనుమతి పొందితే డీపీ నెంబరు అడగాలి. ఇది కలిగి ఉంటేనే అనుమతి ఉన్నట్లు గుర్తించాలి..
* లేఅవుటు కాలనీ నక్షా (ప్లాన్) చూడాలి.
* పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు పరిశీలించాలి
* అంతర్గత రహదారి ప్లాన్లో చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!