మోడువారిన జాతీయ రహదారి!
హైదరాబాద్- వరంగల్ నగరాలను కలిపే జాతీయ రహదారి 163 ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఒకప్పుడు భారీ వృక్షాలతో కళకళలాడింది. ఇప్పుడు ఇరువైపులా ఇప్పుడు ఒక్క చెట్టూ కనిపించదు.
విస్తరించారు.. పచ్చదనం మరిచారు!
ఈనాడు, వరంగల్
ఇది నాలుగు వరుసలుగా విస్తరించిన జాతీయ రహదారి. దీనికి ఇరువైపులా ఒక్క పెద్ద చెట్టు కూడా కనిపించదు..
హైదరాబాద్- వరంగల్ నగరాలను కలిపే జాతీయ రహదారి 163 ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఒకప్పుడు భారీ వృక్షాలతో కళకళలాడింది. ఇప్పుడు ఇరువైపులా ఇప్పుడు ఒక్క చెట్టూ కనిపించదు.
విస్తరణలో భాగంగా సుమారు 4700 భారీ వృక్షాలను నరికేశారు. ఇందులో వందల సంఖ్యలో వేప చెట్లు ఒక్కోటీ 50 ఏళ్ల పైబడినవి ఉండేవి. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ).. చెట్లను తొలగించినందుకు ‘వాల్టా’ చట్టం కింద ఒక్కోదానికి రూ.500 పరిహారం అటవీశాఖకు చెల్లించింది. ఒక్కటి నరికేస్తే దాని స్థానంలో రెండు మొక్కలను పెంచాలనే నిబంధన ఉంది. రహదారి పనులు పూర్తయ్యాక అటవీ శాఖ నామమాత్రంగా మొక్కలను పెట్టి వదిలేసింది. వారి నిర్లక్ష్యం వల్ల అవి ఇప్పటికీ ఎదగలేదు.
ఉద్యమం చేసినా లాభం లేదు
ఒకప్పుడు వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా మర్రి, రావి, వేప లాంటి అనేక వృక్షాలు ఉండేవి. వాహనదారులు ప్రయాణంలో అలసట చెందితే కాసేపు పక్కకు నిలిపి, వాటి కింద సేదదీరేవారు. దీన్ని విస్తరించే సమయంలో భారీ వృక్షాలను తొలగించకుండా 2017లో ‘నీమ్స్ చిప్కో’ అనే స్వచ్ఛంద సంస్థ పెద్ద ఉద్యమమే చేపట్టింది. ఇందులో వరంగల్ నిట్ విద్యార్థులు భాగస్వాములయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో చెట్లను నరికేసే చోటకు వెళ్లి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నరికివేయకుండా భారీ వృక్షాలను మరోచోటికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని లోకాయుక్తను కూడా ఆశ్రయించారు. అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. మరోవైపు మళ్లీ మొక్కలను పెంచుతున్నారంటే అదీ లేదు. ఇటీవల కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రహదారి మధ్యలో సుందరీకరణలో భాగంగా మొక్కలను పెంచుతోంది. ఇప్పటికే ఆరేపల్లి నుంచి పెద్దపెండ్యాల వరకు పనులు పూర్తయ్యాయి. ఇరువైపులా రావాల్సిన భారీ వృక్షాలు మాత్రం ఇప్పట్లో పెరిగే పరిస్థితి కనిపించడం లేదు.
మరోచోటికి మార్చవచ్చు
వృక్షాలను నరికేయడం తప్పకుంటే వాటిని మరో చోటికి మార్చే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటారు. ఇటీవల హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ సమయంలో కొన్ని వృక్షాలను అధికారులు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో మరోచోటికి మార్చారు. వరంగల్ పాత కారాగారం కూల్చేసి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా అనేక వృక్షాలను నరికేయకుండా ఈ ఆవరణలో మరోచోటికి మార్చారు.
ప్రత్యామ్నాయాలు వెతకాలి
- కొలిపాక ప్రకాశ్, వరంగల్
రహదారుల విస్తరణ అభివృద్ధిలో భాగమే. ఈ నెపంతో వందల ఏళ్లనాటి చెట్లను నరికేస్తున్నారు. మళ్లీ మొక్కలను పెట్టి సంరక్షించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. ఇప్పుడు వికారాబాద్ వద్ద మర్రి చెట్లను తీసేసేందుకు రంగం సిద్ధమైతే నేను ఓరుగల్లు నుంచి మన్నెగూడెం వరకు పాదయాత్ర చేశాను. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా, మంచి పర్యావరణాన్ని కానుకగా ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు