భూ హక్కు.. ఎప్పటికి దక్కు!
చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా దరఖాస్తుల ద్వారా భూ హక్కు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాదాబైనామా దరఖాస్తులకు మోక్షమెప్పుడో..?
న్యూస్టుడే, భూపాలపల్లి
మీ సేవ కేంద్రం వద్ద సాదాబైనామా దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన రైతులు (పాతచిత్రం)
చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా దరఖాస్తుల ద్వారా భూ హక్కు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. 2014 జూన్ 2 కంటే ముందు సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములకు హక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.. తెల్లకాగితాలు, స్టాంప్ కాగితాలు, నోటిమాట ద్వారా రిజిస్టర్ కాకుండా దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసుకున్న రైతులు మీ సేవ కేంద్రాల్లో రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం లేకుండా కేవలం యూజర్ ఛార్జీలు మాత్రమే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అటు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రాగా, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు రహస్యంగా దస్తావేజుల విక్రయాలు జరిపి జేబులు నింపుకొన్నారు. కానీ, నేటికీ ఒక్కటంటే ఒక్క సాదా బైనామా దరఖాస్తుకు పట్టా మంజూరు కాకపోవడం శోచనీయం.. తాజాగా పోడు భూముల దరఖాస్తులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సాదాబైనామా దరఖాస్తులను కూడా ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధత కోసం ప్రభుత్వం 2020 నవంబరు 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 11 మండలాల నుంచి మొత్తం 51,347 దరఖాస్తులు వచ్చాయి. పలిమెల మండలంలో అతి తక్కువగా 384 దరఖాస్తులు రాగా, అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 14,150 దరఖాస్తులు వచ్చాయి. 2016లో తొలిసారిగా అవకాశం కల్పించడంతో వేలాది మంది రైతులు లబ్ధిపొందారు. రెండేళ్లుగా సాదాబైనామా భూ పత్రాల జారీలో అడ్డంకులు లేకపోగా, ధరణి పోర్టల్లో నమోదైన సమాచారంతో భూములు చేతులు మారుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
ఆంక్షల తిరకాసు
భూ రికార్డుల యాజమాన్య హక్కులు(ఆర్వోఆర్) చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడంతో 1971 ఆర్వోఆర్ చట్టంలోని క్లాజ్లను చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రెవెన్యూ చట్టంలో క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలు లేవు. కొత్త చట్టాన్ని సవరించాలనే ప్రయత్నం ముందుకు సాగడం లేదు. భూ హక్కులు పొందేందుకు వివిధ ఆంక్షలు బాధిత రైతులకు శాపంగా మారాయి. చట్టబద్ధత కల్పిస్తే అయిదెకరాల్లోపు వ్యవసాయ భూములను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
రెవెన్యూ చట్టం ఆధారంగా ధరిణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చి, భూముల క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట కొనుగోలు చేసిన భూములు ఆన్లైన్లో సదరు పట్టాదారు పేరుతోనే కొనసాగుతున్నాయి. యాజమాన్య హక్కుల మార్పిడి జరగకపోవడంతో పాత యజమానుల వారసులు ధరణి పోర్టల్లోని సమాచారం ఆధారంగా భూములను ఇతరులకు విక్రయించే ప్రమాదం ఉంది. ఈ వెసులుబాటుతోనే రికార్డుల్లో పేర్లు మారుతున్నాయని బాధితులు కొందరు ఆందోళన చెందుతున్నారు. భూములను సాగు చేసుకుంటూ, ప్రతిఫలం అనుభవిస్తున్నప్పటికీ పట్టా హక్కులు లభించడం లేదు.
రైతుల ఆశలు ఆవిరేనా..
కొన్ని దశబ్దాల భూ సమస్యలకు సాదాబైనామా ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశ పడిన చిన్న, సన్నకారు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పట్టా భూములకు మాత్రమే ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, బ్యాంకుల్లో రుణాలు వర్తింపజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా అందుతుంది. సాదాబైనామా ద్వారా పట్టాలు వస్తే తాము కూడా ప్రభుత్వ పథకాలు పొందవచ్చనే ఆశలో ఉన్న రైతుల ఆశలు అడియాసగానే మారుతోంది. సాదాబైనామాలో భూ హక్కు కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లు దాటినా ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం లభించలేదు. దరఖాస్తుల పరిశీలన, పట్టాల మంజూరుకు సంబంధించి ఇంత వరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదని తహసీల్దార్లు పేర్కొంటున్నారు.
భూమి ఉన్నా హక్కులు లేవు
- శ్రీనివాస్రెడ్డి, ఆజంనగర్
గ్రామంలోని ఒక సర్వే నంబర్లో సాదా బైనామాతో 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ భూమి అమ్మిన వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఏళ్ల తరబడి హక్కుల కోసం ఎదురుచూస్తున్నా.. భూమి ఉన్నా పట్టా హక్కులు లేవు. ఏ ఇతర లావాదేవీలకు పనిచేయడం లేదు.
పథకాలు అందక ఇబ్బందులు..
- మాచర్ల రవి, కమలాపూర్
తెల్లకాగితంపై రాసుకున్న ఒప్పందంతో ఎకరం భూమిని కొనుగోలు చేశాను. రెండేళ్ల కిందట పట్టా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అన్ని ధ్రువపత్రాలను సమర్పించాను. రైతు బంధు, పంట రుణం అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్టుబడి అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.