logo

ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లకు ఉద్యోగాలు

ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో కొనసాగుతున్న ‘లక్ష్య’ శిక్షణ శిబిరంలో కోచ్‌ నాగరాజు ఆధ్వర్యంలో కృష్ణ, నిరోష్‌, ఆదిత్య, జనగామ జిల్లా కోచ్‌ రంజిత్‌ ఆధ్వర్యంలో ముక్కెర రాజశేఖర్‌యాదవ్‌ అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

Published : 07 Feb 2023 06:04 IST

కృష్ణ, నిరోష్‌, ఆదిత్యను అభినందిస్తున్న అతిథులు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో కొనసాగుతున్న ‘లక్ష్య’ శిక్షణ శిబిరంలో కోచ్‌ నాగరాజు ఆధ్వర్యంలో కృష్ణ, నిరోష్‌, ఆదిత్య, జనగామ జిల్లా కోచ్‌ రంజిత్‌ ఆధ్వర్యంలో ముక్కెర రాజశేఖర్‌యాదవ్‌ అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల సైనికుల ఉద్యోగాలకు జరిగిన ఎంపిక ప్రక్రియలో వీరు ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సోమవారం హనుమకొండ, జనగామలో జరిగిన కార్యక్రమంలో ఆయా జిల్లాల అథ్లెటిక్స్‌ సంఘాల ప్రతినిధులు అథ్లెట్లను అభినందించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి కేఎస్‌పీ.రాజు, జనగామ జిల్లా క్రీడల అధికారి గోపాల్‌రావు, సంఘం కార్యదర్శి సారంగపాణి, మనోజ్‌, కోచ్‌ శ్రీమాన్‌ పాల్గొన్నారు.

రాజశేఖర్‌ను సన్మానిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని