భార్య, కొడుకుపై హత్యాయత్నం
కట్టుకున్న భార్య, కన్న కుమారుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తి ఘటన సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లిలో చోటుచేసుకుంది.
నిందితుడు కోటిలింగం
నర్సంపేట రూరల్, న్యూస్టుడే: కట్టుకున్న భార్య, కన్న కుమారుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తి ఘటన సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన మేరకు.. చంద్రయ్యపల్లికి చెందిన నిడిగొండ కోటిలింగం, విజయ దంపతులకు కుమారుడు ప్రవీణ్, కుమార్తె ఉన్నారు. ఈ దంపతులు 2005లో బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లారు. కోటిలింగం అక్కడే కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, విజయ వంట మనిషిగా పనిచేస్తున్నారు. తనయుడు ప్రవీణ్ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వరంగల్లో డిగ్రీ చదువుతున్నాడు. కోటిలింగం అనుమానంతో నిత్యం భార్యను వేధించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగిన క్రమంలో పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రెండు రోజుల కిందట హైదరాబాద్లో దంపతుల మధ్య ఇదే విషయమై మరోసారి గొడవ జరిగింది. దీంతో అక్కడి నుంచి వచ్చిన వారు ఆదివారం స్వగ్రామమైన చంద్రయ్యపల్లిలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. భర్త పెట్టే వేధింపులు భరించలేనని, తనకు విడాకులు కావాలని విజయ పెద్ద మనుషులను కోరారు. మరోసారి పంచాయితీ పెడదామని పెద్ద మనుషులు చెప్పగా సరేనని ఇంటికెళ్లారు. సోమవారం పెద్ద మనుషుల వద్దకు భార్య విజయ కుమారుడు ప్రవీణ్ వెళ్లగా అక్కడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన కోటిలింగం, తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో భార్య విజయ గొంతులో పొడిచాడు. అడ్డుకునేందుకు వెళ్లిన కుమారుడు ప్రవీణ్ కడుపులో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న వారిని చూసి భయంతో కోటిలింగం అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన తల్లి, కుమారుడిని స్థానికులు ఆటోలో నర్సంపేటలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స జరిపి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. ఎస్సైలు సురేష్, రవీందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయ ప్రవీణ్
దాడిలో వాడిన కత్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా