పేరుకే జిల్లా ఆసుపత్రి!
ములుగు జిల్లా ఆసుపత్రిని నిధుల కొరత వెంటాడుతోంది. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు.
సీహెచ్సీ స్థాయిలోనే నిధుల కేటాయింపు
ములుగు ఏరియా ఆసుపత్రి
ములుగు, న్యూస్టుడే: ములుగు జిల్లా ఆసుపత్రిని నిధుల కొరత వెంటాడుతోంది. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నతీకరించినప్పటికీ ప్రభుత్వం ఇంకా సామాజిక ఆరోగ్య కేంద్రంగానే భావిస్తోంది. అదే తరహాలో నిధులు కేటాయిస్తోంది.
నిర్వహణ భారం
ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 500 మంది రోగులు వస్తుంటారు. అలాంటి వారికి నిధుల కొరతతో కనీస వసతుల కల్పన కష్టంగా మారుతోంది. ఆసుపత్రిలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంతో మనుగడ సాగుతోంది. జిల్లా ప్రజలకు ఆసుపత్రి పెద్దదిక్కుగా మారడంతో రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏటూరునాగారం, వెంకటాపురం లాంటి సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి సిఫారసు చేసిన వారు కూడా వస్తుంటారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రాన్ని అధునాతన యంత్రాలతో నడిపిస్తున్నారు. 100 పడకలు, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, డిజిటల్ ఎక్స్రే, సుమారు 50 రకాల పైగా రక్త పరీక్షలు నిర్వహించే టీ హబ్, కాన్పులతో పాటు, వివిధ రకాల సర్జరీలు చేయడం లాంటి వసతులు అందుబాటులో ఉండడంతో ప్రజలు వైద్యం కోసం ఎంతో ఆశతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్వహణ బాధ్యత మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి జిల్లా ఆసుపత్రి స్థాయిలో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడాదికి బడ్జెట్ రూ.2.50 లక్షలే..
జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రంగా పరిగణిస్తూ ఏడాదికి ఒకసారి రూ. 2.50 లక్షలు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తోంది. దీంతో సామాజిక ఆరోగ్య కేంద్రమా, ఏరియా ఆసుపత్రా, జిల్లా ఆసుపత్రా అనే సందేహాలు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం ఏరియా ఆసుపత్రిగానైనా పరిగణించి నిధులు కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిధుల కేటాయింపు జరుగుతోంది. ఈ నిధులతో కనీస అవసరాలు, పరికరాల కొనుగోలు, ఆసుపత్రి మరమ్మతులు, రోగుల సంఖ్యను బట్టి వసతుల కల్పన, స్టేషనరీ కొనుగోలు, ఫ్యాన్లు, ట్యూబులు, మోటార్ల మరమ్మతులు, కొనుగోళ్లు చేసుకోవడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఒకటి లేదా రెండు నెలలకు మాత్రమే సరిపోతోంది. మిగిలిన ఏడాదంతా వచ్చే సంవత్సరం బడ్జెట్ కోసం ఎదురు చూపులతోనే గడిచిపోతోంది.
ప్రభుత్వానికి నివేదించాం -డాక్టర్ జగదీశ్వర్, సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి
ములుగు జిల్లా ఆసుపత్రికి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయిస్తున్నట్లుగానే నిధులు ఇస్తున్నారు. దీంతో నిర్వహణ భారంగా మారుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!