పర్యావరణ పరిరక్షణలో మేము సైతం..!
లింగాలఘనపురం యువతులకు అవకాశం వచ్చింది. అంది పుచ్చుకుంటున్నారు. ఓ వైపు ఉపాధి మరోవైపు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు.
సంచులు కుడుతున్న మహిళలు
లింగాలఘనపురం(జఫర్గఢ్) న్యూస్టుడే: లింగాలఘనపురం యువతులకు అవకాశం వచ్చింది. అంది పుచ్చుకుంటున్నారు. ఓ వైపు ఉపాధి మరోవైపు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు. సృష్టి వినాశకారిణి అయిన ప్లాస్టిక్ను క్రమేనా తొలగించాలనే సంకల్పంతో నార సంచుల తయారీకి శిక్షణ పొందుతున్నారు. ‘శిక్షణ పూర్తి చేసుకుంటున్నాం..కుటీర పరిశ్రమ యూనిట్ స్థాపనకు నారసంచుల తయారీకి సిద్ధం’గా ఉన్నామంటూ యువతులు ‘న్యూస్టుడే’కు వివరించారు.
శిక్షణ ఇలా..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్ఎంఈ) సౌజన్యంతో సొసైటీ ఫర్ హెల్త్ అగ్రికల్చర్ అండ్ రూరల్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింగాలఘనపురంలో చేపట్టిన శిక్షణ శిబిరంలో 25 మంది యువతులు, మహిళలు శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. శిక్షÛణలో టిఫిన్బాక్స్ కోసం క్యారియర్ బ్యాగ్, విద్యార్థులకు పెన్సిల్ పౌచ్, వాటర్ బాటిల్ బ్యాగ్, ఆఫీస్ ఫైల్ బ్యాగ్, మహిళల హ్యాండ్బ్యాగ్, మనీ, హ్యాండ్ పర్స్, ఫైల్ ఫోల్డర్, దుకాణం నుంచి సామగ్రి తెచ్చుకునేందుకు షాపింగ్ బ్యాగ్, కూరగాయల కొనుగోలు కోసం అవసరమైన సంచులు తయారు చేయడం నేర్చుకున్నారు.
తయారికి సిద్ధం - మేడబోయిన మాధవి
12 రకాల నార సంచుల తయారీ విధానం పూర్తిగా వచ్చేసింది. ఇక నాణ్యతగా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తాం. ప్లాస్టిక్ సంచుల స్థానంలో ఆరోగ్యదాయకం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే నారసంచులను వాడాల్సిన అవసరాన్ని అలవాటు చేస్తాం.
ఉపాధి అవకాశం - నక్కపల్లి ఉమారాణి
ఇంట్లో ఖాళీగా ఉండకుండా నారసంచులు తయారు చేసి ఉపాధి పొందే అవకాశం దక్కింది. నేర్చుకున్న వాళ్లమంతా సామూహికంగా కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలి.
నైపుణ్యాలు తెలుసుకున్నాం - బెజ్జం వినోద
నార సంచుల తయారీలో నైపుణ్యతలు నేర్చుకున్నాం. మహిళా సమాఖ్య, మహిళా సంఘం సహకారంతో బ్యాంకు రుణం పొంది తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. సంచుల తయారీలో మెలకువలు నేర్పిన సుందరయ్య, నర్సింహాచారి, నాగదేవికి కృతజ్ఞతలు.
బాగా నేర్చుకున్నారు - నాగదేవి, బోధకురాలు
జ్యూట్ బోర్డు సభ్యురాలిగా(అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ఫ్రైజెస్) మహిళా పారిశ్రామిక సంస్థ వారికి మాస్టర్ ట్రైనర్గా శిక్షణ అందించా. ఓఎన్జీసీలో పని చేసిన అనుభవంతో ఇప్పటి వరకు వెయ్యి శిక్షణ శిబిరాలలో 5 నుంచి 6 వేల మందికి శిక్షణ ఇచ్చాం. సుమారు 500 మంది జ్యూట్ బ్యాగ్లను తయారు చేసి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. లింగాలఘనపురంలో యువతులు, మహిళలు తొందరగా నేర్చుకున్నారు. మరో వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రాలు అందుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం