పురపాలనలో ప్రతిష్టంభన లేదు
జనగామ పురపాలికలో అసమ్మతి రాజకీయం, అవిశ్వాస ప్రకటన తదితర రాజకీయ పరమైన అంశాలతో పురపాలన సాధారణ కార్యక్రమాలకు సంబంధం లేదని, ఎలాంటి ప్రతిష్టంభన లేదని పుర కమిషనర్ రజిత అన్నారు.
పుర కమిషనర్ రజిత
జనగామ, న్యూస్టుడే: జనగామ పురపాలికలో అసమ్మతి రాజకీయం, అవిశ్వాస ప్రకటన తదితర రాజకీయ పరమైన అంశాలతో పురపాలన సాధారణ కార్యక్రమాలకు సంబంధం లేదని, ఎలాంటి ప్రతిష్టంభన లేదని పుర కమిషనర్ రజిత అన్నారు. పౌరసేవలు, తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ మంగళవారం కమిషనర్తో ముఖాముఖి నిర్వహించింది.
న్యూస్టుడే: అసమ్మతి రాజకీయం కారణంగా పురపాలనలో ప్రతిష్టంభన ఏర్పడిందా?
పుర కమిషనర్: అదేం లేదు. పాలకవర్గానికి సంబంధించిన ప్రత్యేక రాజకీయ ప్రభావం పురపాలనపై ఉండదు. పౌరసేవలు, అభివృద్ధి పనులకు దాంతో సంబంధం లేదు. ప్రతిష్టంభన లేదు.
న్యూస్టుడే: గత నెల సాధారణ సమావేశం జరగలేదు. నెలవారీ సమావేశాలు జరగకపోతే ఇబ్బందులు ఉండవా? తదుపరి సమావేశానికి కౌన్సిల్ అసమ్మతీయులు రాకపోతే, కనీస హాజరు లేకపోతే ఏం చేస్తారు?
పుర కమిషనర్: సాధారణ సమావేశంతో పాటు, బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలనుకున్నాం. ఈలోగా కంటివెలుగు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే సమయం తీసుకుని ఏర్పాటు చేస్తాం. సమావేశానికి ఆహ్వానం అందరికి ఉంటుంది. కనీస కోరం లేకపోతే వాయిదా సమావేశం జరుగుతుంది. అవసరమైతే కలెక్టర్ సమక్షంలో బడ్జెట్ వివరాలు సమర్పించి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. మూడు మాసాలకు మించి హాజరు తప్పనిసరి, లేని పక్షంలో పుర చట్టం ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
న్యూస్టుడే: కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు దాటాయి. చెప్పదగిన అభివృద్ధి ఏముంది?
పుర కమిషనర్: రూ.30 కోట్ల పనులతో కేంద్రీకృత విద్యుత్తు దీపాలు, విభాగినులు, హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, రహదారి విస్తరణ ఎన్నో జరిగాయి.
న్యూస్టుడే: యార్డులో టన్నుల కొద్ది చెత్త దారిపొడవునా పేరుకుపోతోంది. బయోడిగ్రేడ్ విధానంలో నిర్మూలన ఏమైంది?
పుర కమిషనర్: జనగామ పురపాలిక ప్రాధాన్య క్రమంలో ఉంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. దారిలో చెత్త లేకుండా చర్యలు తీసుకుంటాం.
న్యూస్టుడే: కౌన్సిల్ రాజకీయాలతో నిధులున్నా.. పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి మీరేమంటారు?
పుర కమిషనర్: పట్టణ ప్రగతి నిధులు సెప్టెంబరు వరకు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం టైడ్ నిధులతో చేపట్టాల్సిన పనులపై పరిశీలన జరుగుతోంది. ఎమ్మెల్సీ నిధులతో చేపట్టే పనుల జాబితాను సీపీవోకు పంపించాము.
న్యూస్టుడే: పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారి ఒక్కరే రెండు రోజులు అందుబాటులో ఉంటున్నారు. ఇతర విభాగాల్లో ఖాళీల కారణంగా సేవలకు ఆటంకం కలుగుతుంది. మీరేం చర్యలు తీసుకుంటున్నారు?
పుర కమిషనర్: వివిధ విభాగాల్లో ఖాళీలున్నది వాస్తవమే. పౌరసేవలు చాలా వరకు ఆన్లైన్ కావడంతో ఇబ్బందులు ఉండవు. అక్రమాలపై ఫిర్యాదులుంటే పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.
న్యూస్టుడే: తడి పొడి చెత్త సేకరణ, నిర్వహణపై అనేక కార్యక్రమాలు చేశారు. మార్పు ఉందా?
పుర కమిషనర్:మెప్మా సంఘాల సభ్యులు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటా కంపోస్టు తయారీతో సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు సహకరించాలి. ప్రైవేటు ఏజన్సీలను వినియోగిస్తున్నందున పరిస్థితి మారుతుంది.
న్యూస్టుడే: రూ.కోట్లు ఖర్చవుతున్నా, మున్సిపల్ నీటి సరఫరాలో నాణ్యత లేదంటున్నారు?
పుర కమిషనర్: నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారికి నీటి నాణ్యతపై విశ్వాసం కల్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్