నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తతే పిల్లలకు రక్ష!
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యా తండాలో మూడేళ్ల జయశ్రీ, ఏడాదిన్నర ప్రభాస్ను తల్లిదండ్రులు వ్యవసాయ పనుల వద్దకు తీసుకెళ్లారు.
పురుగు మందుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి..
ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోరిక గోవిందునాయక్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యా తండాలో మూడేళ్ల జయశ్రీ, ఏడాదిన్నర ప్రభాస్ను తల్లిదండ్రులు వ్యవసాయ పనుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూలీలతో కలిసి వారు పని చేస్తుండగా, చెట్టుకింద ఉన్న చిన్నారులు శీతలపానీయం అనుకుని పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామ శివారులోని వడ్డెరగూడానికి చెందిన ఆరెల్లి అక్షర(9), సాదు అఖిల(9), అయిదో తరగతి చదువుతున్న సాదు ఐశ్వర్య(10) ఈ నెల 2న తాము చదువుకుంటున్న పాఠశాలలో పురుగుల మందు తాగారు. అక్షర బ్యాగులో ఉన్న డబ్బాలో తెల్లని ద్రావణం తాగారు. అది వారికి పురుగుల మందు అని తెలియదు. శీతలపానీయం అనుకుని తాగారు.
ధర్మసాగర్, న్యూస్టుడే: తల్లిదండ్రుల అవగాహన లోపంతో పురుగుల నివారణ మందులు అభం శుభం తెలియని పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. జీవితమంతా ధారపోసి బిడ్డల భవిష్యత్తు కోసం వ్యవసాయం చేస్తున్నారో దానికి వాడే రసాయనిక ఎరువులు వారి ప్రాణాలను బలిగొనే పరిస్థితి ఏర్పడుతోంది. రసాయనిక ఎరువులను పిల్లలకు అందుబాటులో ఉండటం.. అవి రకరకాల రంగుల్లో ఉండి కూల్డ్రింక్స్లా ఆకర్షించడంతో వారం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల చిన్న పిల్లలు వాటిని తాగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం..
ఏం చేయాలంటే..
ఎరువులు, పురుగు నివారణ మందులను పంట పొలాలకు వాడి.. మిగిలిపోయిన వాటిని వ్యవసాయ బావుల వద్దనే దాచి పెట్టాలి. రైతులు అలా చేయకుండా ఇంటికి తీసుకొస్తున్నారు. కొన్ని క్రిమిసంహారక మందులు పంటపొలాలకు ఎంత వరకు అవసరమో అంత లభ్యం కావడంలేదు. పావు, అర లీటరు, 60 ఎంఎల్ స్థాయిలలో లభ్యం కావడంలేదు. దీంతో రైతులు తమకు అవసరం లేకున్నా డబ్బాలను కొనాల్సి వస్తోంది. డబ్బాలో ఉన్న పురుగుల మందును అవసరమున్నంత వరకు వాడి మిగతాది దాచిపెట్టుకుంటున్నారు. అలా దాచిపెట్టినదే నేడు ఈ ప్రమాదాలకు కారణమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, వైద్యులు తెలుపుతున్నారు. చిన్న పిల్లలు శీతలపానీయాలు అనుకుని, పెద్దవాళ్లు కూడా చిన్నపాటి ఘర్షణలకు పాల్పడి క్షణికావేశంలో తాగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఈ సీసాలో ఉన్న పురుగుల మందునే కూల్డ్రింక్ అనుకుని తాగారు..
ఈ రైతుల్లా చేద్దాం..
ధర్మసాగర్ మండలం రైతులు కట్కూరి రాజిరెడ్డి, కట్కూరి వెంకటరెడ్డి ఇలా చెబుతున్నారు..
మేము మొదటి నుంచి పురుగుల మందులను పంటపొలాలకు వాడిన తర్వాత మిగిలింది బావి వద్దనే ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతాము. మందు అయిపోతే ఖాళీ డబ్బాలను భూమిలో ఒక చోట గుంత తీసి దాచేస్తాం.. ఇది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఇలానే మాకు అలవాటు. మా భూమి ఇళ్లకు దగ్గరగా ఉంటుంది. ఇటువైపుగా ప్రజలు ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుందని ఇలా చేస్తున్నాం.
చిన్నారులకు తెలియనివ్వొద్దు
- డాక్టర్ శేషుమాధవ్, పిల్లల వైద్య నిపుణులు.హనుమకొండ
అయిదు సంవత్సరాల లోపు పిల్లలు ఏది చేసినా ఆక్సిడెంటల్(అనుకోకుండా)గా చేస్తుంటారు. నేడు కూల్డ్రింక్స్ను అందరూ తీసుకుంటారు. చిన్న పిల్లలు నిత్యం మనం తాగే కూల్డ్రింక్స్ను చూస్తుంటారు. ఏ డబ్బాలో రంగునీళ్లు కనిపించినా అవి కూల్డ్రింక్స్ అనుకుని తాగేందుకు ప్రయత్నిస్తారు. విష పదార్థాలు, విషపు రసాయనాలున్న డబ్బాలను ఇళ్లలోకి తీసుకురావొద్దు. అందులో చిన్న పిల్లలకు కనిపించకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. పంటపొలాలకు వాడే రసాయనాలే కాకుండా ఇళ్లల్లో ఫినాయిల్, డెటాల్ వంటివి కూడా ఇళ్లల్లో పిల్లలకు దూరంగా పెట్టాలి.
అవసరమున్నంతనే కొనుగోలు చేయాలి..
- దామోదర్రెడ్డి, ఏడీఏ. హనుమకొండ జిల్లా
రైతులు తమ పంటపొలాలకు రసాయనిక ఎరువులు ఎంత వరకు అవసరం ఉంటుందో అంతే తెచ్చుకోవాలి. ఒక వేల ఎక్కువ మొత్తంలో పురుగుల మందును తీసుకుంటే వాటిని ఇంటికి తీసుకెళ్లకుండా, వ్యవసాయ బావుల వద్ద, కొట్టాల వద్దనే పిల్లలకు దూరంగా కనిపించకుండా దాచిపెట్టాలి. వాడిన పురుగుల మందు డబ్బాలను సైతం భూమిలో పాతిపెట్టాలి. వాడిన డబ్బాలను బావుల వద్ద, ఇళ్లల్లో వాడకూడదు. ఖాళీ డబ్బాలను సైతం కనిపించకుండా పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ