ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం
ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఇరు కుటుంబాల్లో ఇద్దరు, దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న కుటుంబంలోని బాలిక మృతి చెందారు.
డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం
శ్రీహిత రాజశేఖర్ రహీంఖాన్
జనగామ రూరల్, న్యూస్టుడే: ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఇరు కుటుంబాల్లో ఇద్దరు, దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న కుటుంబంలోని బాలిక మృతి చెందారు. కుటుంబాన్ని పోషించే యజమానులు మృతి చెందడంతో.. వారినే నమ్ముకొని జీవిస్తున్నవారు రోడ్డున పడ్డారు. మరో కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కంటి పాప మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.
జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి పరిధిలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున టైరు పంక్చరు కావడంతో ఆగిన డీసీఎం వ్యాన్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన పాత ఇనుప సామగ్రి యజమాని వాటం రాజశేఖర్(33), సికింద్రాబాద్ చిలుకలగూడకు చెందిన డీసీఎం డ్రైవర్ అబ్దుల్ రహీంఖాన్(38) అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్ రహీంఖాన్ డీసీఎం నడుపుతూ.. ఐదేళ్లుగా యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో కుటుంబంతో నివసిస్తున్నారు. రాజశేఖర్ తన పాత ఇనుప సామగ్రి లోడ్ను రహీంఖాన్ తన డీసీఎంలో ప్రజ్ఞాపూర్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే దుర్ఘటన జరగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు పెద్దపల్లి జిల్లా రానాపూర్కు చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి ఓ బ్యాంకులో మేనేజర్, అతని భార్య శ్రావణి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె శ్రీహిత(7) ఉన్నారు. వీరు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్నారు. నాలుగు రోజుల కిందట కాజీపేటలో తమ బంధువులతో కలిసి తిరుపతి దైవ దైర్శనానికి వెళ్లి రైలు ప్రయాణం ద్వారా తిరిగి కాజీపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. పెంబర్తి వద్ద డీసీఎం నిలిపి ఉన్న చోటుకు రాగానే కారు అదుపు తప్పి డీసీఎంను ఢీ కొట్టడంతో దేవేందర్రెడ్డి, శ్రావణి, శ్రీహితలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో జనగామకు తరలిస్తుండగా మార్గమధ్యలో శ్రీహిత మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో.. దేవేందర్రెడ్డి, శ్రావణిని వరంగల్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జనగామ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాద మృతులు డీసీఎం డ్రైవర్ రహీంఖాన్కు భార్య హస్మ, పిల్లలు ఫాతిమా, జబి ఉన్నారు. రాజశేఖర్కు భార్య ధనలక్ష్మి, పిల్లలు అనిశ్, సహస్ర, స్త్రీనిధి ఉన్నారు. మూడు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందడంతో.. ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో బంధువులు తరలి వచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో వారి రోదనలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ