Warangal: అత్తింటి వేధింపులకు మహిళా కానిస్టేబుల్ మృతి
అదనపు కట్నం వేధింపు బాధితులకు అండగా నిలిచిన మహిళా కానిస్టేబులే అత్తింటి వేధింపులకు బలయ్యారు. మరికొద్ది నెలల్లో ఎస్సై కాబోతున్నానని ఆశతో ఉన్న ఆ యువతి కానరాని లోకానికి వెళ్లిపోయారు.
పోలీసుల అదుపులో భర్త, అత్త, బావ
భర్త, పిల్లలతో మౌనిక (పాత చిత్రం)
ములుగు రోడ్డు, న్యూస్టుడే: అదనపు కట్నం వేధింపు బాధితులకు అండగా నిలిచిన మహిళా కానిస్టేబులే అత్తింటి వేధింపులకు బలయ్యారు. మరికొద్ది నెలల్లో ఎస్సై కాబోతున్నానని ఆశతో ఉన్న ఆ యువతి కానరాని లోకానికి వెళ్లిపోయారు. వరంగల్ వేణురావు కాలనీకి చెందిన నాంపెల్లి మౌనిక (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహబూబాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆమె ఇంట్లో ఉరి వేసుకుందని ఎంజీఎంకు తీసుకెళ్తున్నామని అత్తింటి వారు తల్లిగారికి సమాచారం ఇచ్చారు. తల్లి తరఫు బంధువులు ఎంజీఎంకు వచ్చేసరికే మౌనిక మృతిచెందారు. భర్త, అత్త, బావ కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాజేందర్ కన్నీరుమున్నీరయ్యారు. ఎంజీఎంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మార్చురీ వద్ద మౌనిక బంధువులు మృతురాలి అత్తపై దాడికి దిగారు. హత్యచేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక భర్త శ్రీధర్, అత్త వీరలక్ష్మి, బావ కృష్ణమూర్తిపై వేధింపుల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని వడ్డేపల్లికి తరలించారు.
ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్న సమయంలో..
వడ్డేపల్లికి చెందిన ఎదులాపురం రాజేందర్ సుగుణ కూతురు మౌనిక. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి మరణించింది. రాజేందర్ నర్సమ్మను వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి దేశాయిపేట రోడ్డుకు నివాసం మార్చారు. 18 ఏళ్లు నిండిన నెలకే 2014లో మౌనిక కానిస్టేబుల్ కొలువును సాధించారు. 2015లో ఫైనాన్స్ వ్యాపారి శ్రీధర్ను వివాహం చేసుకోగా, వీరికి ఎల్కేజీ చదువుతున్న ఒక కుమారుడు మౌహక్వీర్, యూకేజీ చదువుతున్న నిహారిక ఉంది. శ్రీధర్ సోదరుడు కృష్ణమూర్తికి సంతానం లేకపోవడంతో నిహారికను దత్తత ఇచ్చారు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మౌనిక ఎస్సై ఉద్యోగ సాధనకు ఇటీవల రాత పరీక్ష, ఈవెంట్స్లో నెగ్గారు. మెయిన్స్కు సిద్ధమవుతున్నారు.
హత్యేనంటున్న తల్లిదండ్రులు
పోలీసు స్టేషన్కు వచ్చిన ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యాన్ని నూరిపోసిన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మరని రాజేందర్, నర్సమ్మ వాపోయారు. ముమ్మాటికి ఇది హత్యేనని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఏడుస్తూ చెప్పారు. డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోయింది, ఎన్ని గంటలకు వస్తున్నావని సూటిపోటి మాటలతో అత్త వేధింపులకు పాల్పడేదన్నారు. మౌనిక జీతం రాగానే శ్రీధర్ ఖాతాలోకి పంపించాలని హుకుం జారీచేసేదన్నారు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే.. ఆ రోజు యుద్ధమేనన్నారు. డబ్బులు, ఉద్యోగం మౌనికవే అయినా అత్తింటి వారు ఓర్వలేనితనంతో ఇంకా డబ్బు తేవాలని వేధించేవారని కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్