దేశాయిపేట ఆరోగ్య కేంద్రానికి జాతీయ గుర్తింపు
ఏటా ఇచ్చే జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) ఈసారి ఉమ్మడి జిల్లాలో వరంగల్ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రానికి దక్కింది.
పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్యులు, సిబ్బంది
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: ఏటా ఇచ్చే జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) ఈసారి ఉమ్మడి జిల్లాలో వరంగల్ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రానికి దక్కింది. ప్రపంచంలోనే ఉత్తమ సేవలందించే ఆసుపత్రులుగా తయారు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మండలి ద్వారా ఈ జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల పత్రాలను ఇస్తున్నారు. ఈసంవత్సరం జనవరి మాసంలో దిల్లీ నుంచి వచ్చిన నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం పరిశీలనలో దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గుర్తిస్తూ ఆదివారం సాయంత్రం జాతీయ ఆరోగ్య మండలి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రి భవనం, దానికి రంగు, గేటు, రోగులు కూర్చోవడానికి కుర్చీలు, డస్టుబిన్, మరుగుదొడ్లు, తాగునీరు, ఆసుపత్రిలోని ఫార్మసీ గది, వైద్యుడి గది, అత్యవసర ప్రసూతి గది, వైద్యుడి పనితీరు, సిబ్బంది రోగులతో మాట్లాడేతీరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, గ్రీనరీ, స్వచ్ఛభారత్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర బృందం 100 మార్కుల స్కోరుకు గానూ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రం 90.4 శాతం మార్కులు ఇచ్చింది. ఈ గుర్తింపు సర్టిఫికెట్తోపాటు కేంద్ర జాతీయ ఆరోగ్య మండలి నుంచి మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం రూ.2 లక్షల ప్రోత్సాహకం అందిస్తారని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ గుర్తింపుతో రోగులకు మెరుగైన ఉత్తమ సేవలు అందుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు