logo

‘ఓట్ల కోసం తప్పుడు హామీలు’

ఎస్సీల వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను భూ స్థాపితం చేస్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి అన్నారు.

Published : 21 Mar 2023 03:46 IST

ములుగు, న్యూస్‌టుడే: ఎస్సీల వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను భూ స్థాపితం చేస్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి అన్నారు. సోమవారం ములుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తెలిసి కూడా రాజకీయ పార్టీలు తాము అనుకూలమని చెప్పడం సరికాదని, అలాంటి పార్టీల అంతు చూస్తామని హెచ్చరించారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఓటు రాజకీయం కోసం తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు అయిపోగానే ముఖం చాటేస్తున్నారన్నారన్నారు. ములుగు జిల్లాలోని ప్రతి మండలంలో అంబేడ్కర్‌ విగ్రహం, మాల కమ్యూనిటీ భవనాల నిర్మాణం జరిగేంత వరకు తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ములుగు మండలం పత్తిపల్లికి చెందిన కారం రాంబాబును ములుగు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. బోగం కుమార్‌, దాసరి రమేష్‌, బోడ శ్రీనివాస్‌, దయాకర్‌, లుకాస్‌, రాము, లాలయ్య, భాస్కర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని