రైతన్నకు మిగిలింది కన్నీరే!
వడగళ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చింది. పెద్దపెద్ద రాళ్లు పంటలపై బాంబుల్లా పడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి, వరి, అనేక రకాల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నాలుగేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన బీమా
ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ రైతు జంగిలి రమేష్
నాలుగెకరాల్లో వేసిన మొక్కజొన్న ఇలా పూర్తిగా పడిపోయింది..
ఈనాడు, వరంగల్: వడగళ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చింది. పెద్దపెద్ద రాళ్లు పంటలపై బాంబుల్లా పడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి, వరి, అనేక రకాల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో పంటలు నేలకొరగడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటూ ‘అయ్యో దేవుడా ఎంత పనైంది’ అంటూ రోదిస్తున్నారు. తీవ్ర పంట నష్టం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి చూసి వెళుతున్నారు. పరిహారం కొద్దిమొత్తంలో అందడానికి కర్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పడం లేదు. తాజాగా కురిసిన వానలకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. 50 శాతం కన్నా తక్కువ దెబ్బతింటే పరిగణనలోకి తీసుకోవడం లేదు.
భరోసా లేదు..
అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసినప్పుడు వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వం నుంచి సరైన సమయంలో గిట్టుబాటు కలిగేలా బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ లాంటివి అందని ద్రాక్షలా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై అమలుచేసే ఫసల్ బీమా రాష్ట్రంలో ఎత్తివేయడంతో రైతులకు విపత్తుల సమయంలో భరోసా ఉండడం లేదు. 2018 నుంచి బీమాను పూర్తిగా ఎత్తేయడంతో రైతన్నలెవరూ ప్రైవేటు బీమా కంపెనీల్లో ప్రీమియం చెల్లించడం లేదు. బాగా అవగాహన ఉండి, ఆర్థికంగా బాగున్న రైతులు ఒకరిద్దరు మాత్రమే ప్రైవేటు కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. రైతులకు విపత్తుల సమయంలో నష్ట పరిహారం అందడం గాల్లో దీపంలా తయారైంది.
చెల్లించేందుకు ఏళ్లు..
ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంభవించిన విపత్తుల సమయంలో రైతులకు పైసా బీమా రాలేదు. పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి, కొద్ది మొత్తంలో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది.
* 2021 డిసెంబరు, 2022 జనవరిలో కురిసిన రాళ్లవానకు మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లోని రైతులు సర్వం కోల్పోయారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, జిల్లా మంత్రులతో కలిసి పరిశీలించారు. వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఇది 2022 డిసెంబరు వరకూ అందలేదు. మొక్కజొన్న హెక్టారుకు రూ.8300, వరికి రూ.13 వేలు మాత్రమే పరిహారం అందిస్తారు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ధరలకు ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు వడగళ్లు
నర్సంపేట మండలం బాంజిపేటకు చెందిన రైతు భూషబోయిన రాజన్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా పంట మొత్తం నేలపై పడిపోయింది. గతంలో మిర్చి సాగు చేయగా వైరస్ సోకడంతో దాన్ని దున్ని మొక్కజొన్న వేశారు. ఇప్పుడు అకాల వర్షంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.
అన్నీ పోయాయి...
.ఖానాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బూస అయిలయ్య, అరుణ దంపతులు రెండెకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో మొక్కజొన్న వేయగా అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు రూ.మూడు లక్షల అప్పులే మిగిలాయి.
అప్పుడు.. ఇప్పుడు నష్టమే...!
ఖానాపురం మండలంలో రైతు బొడ్డ పున్నం ఎకరంలో పచ్చజొన్న వేయగా ఆ పంట ఎందుకూ పనికి రాకుండా పోయింది. తాను గతంలో కూడా మిర్చి పంట తెగుళ్లతో నష్టపోయానని, ఇప్పుడు వడగళ్ల వర్షానికి జొన్న పంట నేలపాలైందని చెప్పారు.
నేల రాలిన మామిడి...
ఖానాపురం మండలం కొత్తూరులో మడద శ్రీనివాస్కు చెందిన మూడెకరాల మామిడి తోటలోని కాయలు రాలిపోయాయి. ఈ ఏడాది మంచి కాత వచ్చిందనుకుంటే వడగళ్ల వర్షం నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రైతు పేరు సీతారాం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోనాయమాకుల. రెండెకరాల్లో మొక్కజొన్న వేయగా శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పంట మొత్తం దెబ్బతింది. మరో నెలరోజుల్లో కోతకు వస్తున్న క్రమంలో ఇలా జరగడంతో సీతారాం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట మొత్తం నష్టపోయినా ఎప్పుడూ బీమా పరిహారం రాలేదని.. ఎప్పుడో పదేళ్ల కిందట ఒకసారి పరిహారం అందుకున్నానని తెలిపారు. ఈ అన్నదాత రూ. లక్ష పైనే నష్టపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!