మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు పేలుడు సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేసిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ గాష్ ఆలం
ములుగు, న్యూస్టుడే: ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు పేలుడు సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేసిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచెంద్రాపురం సమీపంలో జరిగింది. వారి నుంచి పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గాష్ ఆలం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రామచంద్రాపురం వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో వాహనాల తనిఖీలు చేపట్టగా కారు, మోటారు బైక్పై వెళ్తున్న రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మావోయిస్టు ప్రధాన నాయకుడు దామోదర్ను కలవడానికి, పేలుడు సామగ్రి అప్పగించడానికి వెళ్తున్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన అందె రవి, దీక్షకుంట గ్రామానికి చెందిన దిడ్డి సత్యం, మల్హర్ మండలం పెద్దతండాకు చెందిన అనసూరి రాంబాబు, వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడకు చెందిన శ్రీరామోజు మనోజు, శ్రీరామోజు భిక్షపతిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 45 ఇనుప వస్తువులు, 10 మీటర్ల వైరు, రెండు డిటోనేటర్లు, బ్యాటరీ, విప్లవ సాహిత్యం, కారు, బైక్, 8 చరవాణులు, రూ.4,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు పేలుడు పదార్థాలు, ఇతర మెటీరియల్ సరఫరా చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధి బాలాజీనగర్కు చెందిన గణపురం చంద్రమౌళి, పృథ్వీరాజ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన అందె మానసలను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 14 మందిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...