logo

సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్‌దే

అభివృద్ధి, సంక్షేమ పథకాల ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు అన్నారు. స్థానిక వర్తక సంఘం భవనంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 21 Mar 2023 04:15 IST

మాట్లాడుతున్న జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు

గార్ల, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమ పథకాల ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు అన్నారు. స్థానిక వర్తక సంఘం భవనంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో ఆమె మాట్లాడారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను 8 ఏళ్లలో తెరాస నుంచి భారాస దాకా నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలకు భారాలుగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు, ఎమ్మెల్యే హరిప్రియ సూచనల మేరకు ఆత్మీయ సమ్మేళనాన్ని గార్ల మండలంలో ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఎంపీపీ శివాజీచౌహాన్‌, సర్పంచి బన్సీలాల్‌, ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోతీలాల్‌, భారాస మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌, రాధాకృష్ణ, భాస్కరరావు, గణేష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని