వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణస్వీకారం
జనగామలోని మార్కెట్యార్డులో సోమవారం వ్యవసాయ విపణి కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్యల సమక్షంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సిద్ధిలింగంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న జిల్లా అధికారి నాగేశ్వరశర్మ
జనగామ, న్యూస్టుడే: జనగామలోని మార్కెట్యార్డులో సోమవారం వ్యవసాయ విపణి కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ పి.సంపత్రెడ్డి, జనగామ, స్టేషన్ఘన్పూర్ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ.. జనగామ మండలం పెంబర్తికి చెందిన పాలకవర్గం అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం, రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన ఉపాధ్యక్షుడు ముసిపట్ల విజయ్కుమార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్లు మాలరాజు, శివరాత్రి రాజ్కుమార్, నూనెముంతల యాకస్వామి, బస్వగాని బాలమల్లేశ్, సేవెల్లి మధుసూదన్, గువ్వలరవి, బుషిగంపల ఆంజనేయులు, ధర్మ జయప్రకాశ్రెడ్డి, అజ్మీరా మంగమ్మ, సూదగాని సంజీవ, మాశెట్టి వెంకటేశ్వర్లు, మాశెట్టి అశోక్లతో పాటు మార్కెటింగ్ జిల్లా అధికారి నాగేశ్వరశర్మ, జనగామ పీఏసీఎస్ ఛైర్మన్ మహేందర్రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పి.జమున ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కమిటీ అధ్యక్షుడు సిద్ధిలింగం రిజిస్టర్లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి మార్కెట్ వరకు ఒగ్గు కళాకారులు, బోనాలు, కోలాటం కళాకారుల బృందాల ఆట, పాటలు, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. సిద్ధిలింగం, విజయ్కుమార్, ఇతర డైరెక్టర్లను ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్కుమార్ సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశం మార్కెట్ మాజీ ఛైర్పర్సన్లు బాల్దె విజయ, బండ పద్మ, కాయితాపురం మహేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మణికంఠ, మారపాక రవి, మాలోతు శ్రీనివాస్, దీపిక, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద, అడ్తీదారుల సంఘాల నాయకులు, హమాలీ, దడువాయి, మార్కెట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. *తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భారాసను స్థాపించారని జడ్పీ ఛైర్మన్ పి.సంపత్రెడ్డి, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్య అన్నారు. కేసీఆర్కు ప్రజలు అండగా నిలిచి కాపాడుకోవాలని కోరారు. జడ్పీఛైర్మన్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి కొత్త కార్యవర్గం పాటు పడాలన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం మాట్లాడుతూ రైతులకు సేవలందించేందుకు తమ కమిటీ నిరంతరం శ్రమిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్