విన్నవించాం.. పరిష్కరించండి..!
సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతులు సమర్పించారు.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగు, న్యూస్టుడే: సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతులు సమర్పించారు. కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించి కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. మరికొన్నింటిని ఇతర శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలని, తిరస్కరణకు గురైతే కారణాలను ఫిర్యాదుదారులకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 36 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
* ములుగు మండలం పులిగుండం గ్రామానికి చెందిన బూక్క లక్ష్మి పట్టాదారు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
* ములుగు జంగాపల్లికి చెందిన జాడి ప్రశాంతి భూ సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చారు.
* కాసిందేవిపేటకు చెందిన డి.పురుషోత్తమ రావు పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కలెక్టర్ను కోరారు.
* ములుగు బండారుపల్లికి చెందిన జె.ప్రమీల భూ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.
* మంగపేట మండలం రామచంద్రునిపేటకు చెందిన రాంబాబు రాజుపేట కెనరా బ్యాంకు రూ.లక్ష రుణం మంజూరు చేసినా నగదు విడుదల చేయడం లేదని పిర్యాదు చేశారు.
దరఖాస్తుల వివరాలు
ప్రజావాణిలో వచ్చిన మొత్తం ఫిర్యాదులు : 36
రెవెన్యూ : 15
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ: 7
రెండు పడక గదుల ఇళ్లు: 5
ఆసరా పింఛన్ : 5
ఇతర సమస్యలు: 4
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
- ప్రశాంత్, ఇంచర్ల, ములుగు
ఇంచెర్ల గ్రామ శివారులో ఉన్న మా భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారు. ఆ భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మా తాతకు ఇచ్చారు. ఇప్పుడు ఇతరులు దాన్ని ఆక్రమించుకున్నారు. వారిపై చర్య తీసుకోవాలి.
మూడు నెలలుగా పింఛన్ నిలిపివేశారు
- బి.రజిత, అడవి రాంగాపురం, వెంకటాపూర్
మూడేళ్లుగా వికలాంగుల పింఛన్ ఇసున్నారు. సదరం ధ్రువీకరణ పత్రాన్ని రెన్యూవల్ చేసుకోలేదని మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. ఈ నెల 19 వరకే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. సమయం ముగియడంతో.. దరఖాస్తు చేసుకోలేదు. అధికారులు చొరవ తీసుకొని పింఛన్ ఇప్పించాలి.
ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
- సీహెచ్ రమాదేవి: నర్సాపూర్, వెంకటాపూర్ మండలం
నర్సాపూర్ శివారులో మాకు 6.18 ఎకరాల భూమి ఉంది. నా భర్త పేరున 3.9 ఎకరాలు ఉంది. ఆ భూమిని ఇతరులు పట్టాచేయించుకున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. మా భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించి ఆదుకోవాలి.
నిర్మాణాన్ని ఆపాలి
- పరిపూర్ణాచారి, ములుగు
1993 సంవత్సరం నుంచి ఒక గదిలో దుకాణం నడుపుతున్నాను. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దుకాణాన్ని మూసివేశాను. ఆ స్థలంలో గ్రామ పంచాయతీ వారు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. అడిగితే స్పందించడం లేదు. నిర్మాణాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి.
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
అర్జీ స్వీకరిస్తున్న పీవో అంకిత్
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ పీవో అంకిత్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన పీవో తక్షణమే అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసంబంధిత సమస్యలు వచ్చాయి. దరఖాస్తులను పరిష్కరించడంతో నిర్లక్ష్యం చేయకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, ఎస్వో రాజ్కుమార్, ఏవో రఘు, మేనేజర్ శ్రీనివాస్, ఈఈ హేమలత, పీహెచ్వో రమణ, భారతి, డిప్యూటీడీఎంహెచ్వో క్రాంతికుమార్, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి