పది పరీక్షల వేళ.. కేంద్రాల్లో సమస్యలు ఇలా..
జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల సమావేశాలు నిర్వహించి.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జనగామ అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల సమావేశాలు నిర్వహించి.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా పాఠశాలల్లో అరకొర వసతులే ఉన్నాయి. పరీక్షలకు కేవలం 13 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై సోమవారం న్యూస్టుడే పరిశీలన చేపట్టింది. ఆ వివరాలివి..
జాడలేని పంకాలు, దీపాలు
చెత్తాచెదారంతో మరుగుదొడ్డి
జనగామ ధర్మకంచలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 135 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ తరగతిగదుల్లో దీపాలు లేవు. కొన్ని గదుల్లో ఒక్కో ఫ్యాన్ ఉన్నా పని చేయడం లేదు. మిగతా గదుల్లో ఫ్యాన్లే లేవు. విద్యార్థులు ఉక్కపోతతో పరీక్ష రాయాల్సిన దుస్థితి. సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా అపరిశుభ్రంగా ఉండడంతో దుర్గంధం వస్తోంది. కొత్త భవనానికి వచ్చేమార్గంలో పాఠశాల గోడ శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరంగా ఉంది.
న్యూస్టుడే, జనగామ అర్బన్
అధ్వానంగా మూత్రశాలలు
జఫర్గఢ్ ఆదర్శ పాఠశాలలో..
జఫర్గఢ్లోని ఆదర్శ ఉన్నత పాఠశాలలో 175 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. బాలురకు కేటాయించిన 2 మరుగుదొడ్లు, 8 మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్డిలో బేసిన్ శిథిలమైంది. మరో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండడంతో దుర్గంధం వస్తోంది. కొన్ని తరగతి గదులకు తలుపులు లేవు.
న్యూస్టుడే, జఫర్గఢ్
విరిగిపోయిన తలుపులు
బచ్చన్నపేటలో తలుపు లేని గది
బచ్చన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు, కిటికీలకు తలుపులు విరిగిపోయాయి. విద్యుత్ సౌకర్యం ఉన్నా తరగతి గదుల్లో విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు లేవు. పాఠశాలలోని విద్యార్థులు ప్రస్తుతం బోరు నీటినే తాగుతున్నారు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేదు.
న్యూస్టుడే, బచ్చన్నపేట
అపరిశుభ్రంగా గదులు
కొడకండ్లలో..
కొడకండ్ల మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో నాలుగు గదుల్లో సౌకర్యాలు లేవు. ఈ కేంద్రాల్లో గదులను శుభ్రం చేసి విద్యుత్తు, ఫ్యాన్లు, దీపాలు, డెస్క్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేకపోవడంతో అపరిశుభ్రంగా ఉన్నాయి.
న్యూస్టుడే, కొడకండ్ల
తాగునీటి సౌకర్యం కరవు
పాలకుర్తి ఉన్నత పాఠశాలలో దీపం లేని గది
పాలకుర్తిలోని జడ్పీ ఉన్నతపాఠశాలలో వసతులు అరకొరగానే ఉన్నాయి. విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తీగలు సరిగ్గా లేవు. తరగతి గదుల్లో దీపాలు లేవు. ఫ్యాన్లు ఉన్నా తిరగడం లేదు. ఒక పరీక్ష కేంద్రంలో తాగు నీటి సౌకర్యం ఉండగా.. మరో కేంద్రంలో లేదు. మూత్రశాలలు అరకొరగానే ఉన్నాయి.
న్యూస్టుడే, పాలకుర్తి
ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం..
-రాము, జిల్లా విద్యాశాఖాధికారి
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని పాఠశాలల నిర్వాహకులకు సూచించాం. కలెక్టర్ నిర్వహించిన సమన్వయ సమావేశంలోనూ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో గుర్తించిన సమస్యలపై దృష్టి సారిస్తాం. పరీక్షల సమయం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.
జిల్లాలో పరీక్ష కేంద్రాలు : 42
హాజరు కానున్న విద్యార్థులు : 6748
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు