కన్నీరే మిగిలింది.. ఆదుకోండి సారూ!
‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది.
నేడు మహబూబాబాద్ వరంగల్, జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
ఈనాడు, వరంగల్, ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, నర్సంపేట, వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే
‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది. రూ.లక్షలు పోసి సాగు చేసిన మిర్చి.. రాళ్ల దెబ్బలకు అక్కరకు రాకుండా పోయింది. వరి, కూరగాయలు అన్నీ ఆగమయ్యాయి. గతేడాది రాళ్లవానకు పంటలు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న మాపై మళ్లీ వరుణుడు కన్నెర్రజేశాడు.. మునిగిన మా పంటల్ని చూసి కరుణించండి. మరోసారి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా శ్రమకు తగ్గ పరిహారం ఇచ్చి ఆదుకోండి’
సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ముఖ్యమంత్రికి చేసుకుంటున్న వేడుకోలు ఇది..
రెక్కల కష్టం.. వడగళ్ల పాలైంది..
నేలతల్లిని నమ్మితే గుండెకోత మిగిలింది!
అందరి కడుపు నింపే అన్నదాతకు..
అప్పుల కుప్పే సుడిగుండమైంది.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
మధ్యాహ్నం 12.10: ఖమ్మం నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుంటారు.
12.55: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపూర్ గ్రామానికి వస్తారు.
1.30: కరీంనగర్ జిల్లాకు బయలుదేరుతారు.
ఏడాదిగా ఎదురుచూపులు
ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. గతేడాదీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2021 డిసెంబరు, 2022 జనవరి నెలల్లో కురిసిన వానలకు మిర్చి, పత్తి, మొక్కజొన్న మట్టిపాలైంది. గతేడాది జనవరిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి.. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పర్యటించి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా కొందరికి పరిహారం రాలేదు. ఇప్పుడిప్పుడే కొందరికి చెక్కులను ప్రభుత్వం అందిస్తోంది. గత అనుభవం దృష్ట్యా ఈసారి నష్ట పరిహారం వీలైనంత త్వరగా ఇస్తే రైతుల కన్నీళ్లను కొంత వరకైనా ప్రభుత్వం తుడిచినట్టు అవుతుంది.
వ్యయం కొండంత.. పరిహారం గోరంత!
ఈసారి యాసంగిలో వరి సమానంగా సాగవుతున్న మొక్కజొన్న ఆశలపై వడగళ్లు దెబ్బకొట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,17,355 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఇందులో సగానికిపైగా మరో పది రోజుల్లో చేతికొచ్చే పంటను కర్షకులు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. పంటకు పెట్టిన పెట్టుబడి వ్యయం కొండంత అయితే సర్కారు ఇచ్చే పరిహారం మాత్రం గోరంత ఉంటోంది. అది వారికి ఏ మాత్రం ఆసరా ఇవ్వని దుస్థితి.
* నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన చిబిరాల చక్రపాణి గతేడాది మునగ తోట సాగు చేశారు. వానలకు ఎకరంన్నర మేర దెబ్బతింది. ఈ ఏడాది మొక్కజొన్న పంట కూడా ధ్వంసమైంది. వరుసగా రెండేళ్లు తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి రూ. లక్ష పెట్టుబడి పెడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ సరిపోవడం లేదన్నారు.
* వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సింగ్యా తండాకు చెందిన బదావత్ మోతిలాల్, బూలమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న వేయగా వడగళ్ల వర్షానికి ఎందుకు పనికి రాకుండా పోయింది. కూరగాయల పంటలు కూడా మిగలలేదు. తనకు ఇద్దరు ఆడపిల్లలని.. రూ.రెండు లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టానని.. ఆదుకోవాని వేడుకున్నారు.
*వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామానికి చెందిన మట్టెవాడ రాజయ్య తనకున్న భూమితోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశారు. పెట్టుబడి రూ.నాలుగు లక్షలు అయ్యాయని.. అకాల వర్షంతో మొత్తం నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు సార్లు నష్టపోయారు
ఈ రైతు పేరు ముస్కుల దేవేందర్రెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం. గతేడాది వడగళ్ల వాన కురిసి రెండెకరాల్లో మిర్చి, ఎకరంలో మొక్కజొన్న నష్టపోయారు. తాజాగా కురిసిన అకాల వర్షానికి రెండెకరాల్లో మొక్కజొన్న, ఎకరం మిర్చి పూర్తిగా నష్టపోయారు. అప్పటి పరిహారం ఇప్పటికీ అందలేదని దేవేందర్ చెప్పారు. పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్గా అమలు చేయాలని, పంటల గిట్టుబాటు ధరలు స్థిరీకరించాలని ఈ రైతు కోరుతున్నారు.
అన్నీ పోయాయి.. అప్పులు మిగిలాయి
గీసుకొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన రైతు కౌడగాని రవీందర్ పత్తి, మొక్కజొన్న కలిపి మూడెకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న పూర్తిగా నేలపాలైందని.. ఒక ఎకరంలో వేసిన మల్లెపూల తోట పనికి రాకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రూ.3 లక్షలు అప్పు మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ సాయం అందలేదు
- అల్లె రాజు, మిర్చి రైతు, రాయపర్తి, నడికూడ మండలం
గతేడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.10 లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేశాను. వడగళ్ల వర్షంతో పంట దెబ్బతింది. రూ.30 లక్షల నష్టం వాటిల్లింది. మంత్రులు, అధికారులు వచ్చారు. పంట నష్టపరిహారం లెక్కలు రాసుకుపోయారు. ఇప్పటి వరకు సాయం అందలేదు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి