పెరుగుతున్న క్షయ రోగులు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. 2025 నాటికి క్షయను దేశం నుంచి దూరం చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లాల క్షయ నిర్మూలన శాఖలు చర్యలు చేపడుతున్నా..
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే
క్షయ వ్యాధిని నిర్ధారించే సిబినట్ యంత్రం
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. 2025 నాటికి క్షయను దేశం నుంచి దూరం చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లాల క్షయ నిర్మూలన శాఖలు చర్యలు చేపడుతున్నా.. మరోపక్క చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినం సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధి నిర్మూలన చర్యలపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి గుర్తింపునకు ల్యాబ్టెక్నీషియన్లు తెమడ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో పరీక్ష చేయడానికి ఇబ్బంది కలిగితే వారు తెమడ పూతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దగ్గర ఉన్న వరంగల్, హనుమకొండ జిల్లాల క్షయ నిర్మూలన కేంద్రంలో సిబినట్ యంత్ర సాయంతో 48 గంటల్లో వ్యాధి నిర్ధరణ చేసి నివేదిక ఇస్తారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కానప్పుడు(ఉదా: ఊపిరితిత్తుల్లో క్షయ) తెమడతోపాటు ఎక్స్రే పరీక్ష చేస్తారు. అందులోనూ నిర్ధారణ కాకపోతే ఎల్పీఏ, ఎంజీఐటీ, లిక్విడ్ కల్చర్ పరీక్షలను హైదరాబాద్ లో చేయిస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు మంచి పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద రోగులకు ప్రతి నెలా రూ.500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుండగా, వరంగల్ జిల్లాలో 882 మంది, హనుమకొండ జిల్లాలో 818 మంది రోగులు ప్రయోజనం పొందుతున్నారు.
అందుబాటులోకి రాని ల్యాబు
కాకతీయ మెడికల్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వ క్షయ నిర్మూలన సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో బ్యాక్టీరియల్ కల్చర్ డ్రగ్ రెసిస్టెన్స్ నిర్ధారణ కేంద్రం(ఐఆర్ఎల్ కల్చర్ డీఎస్సి ల్యాబు) ఇప్పటివరకు ప్రారంభించలేకపోయారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మూడేళ్లక్రితం పునాది వేయగా, గత సంవత్సరం నవంబరులో తెలంగాణ వైద్యసేవలు మౌలిక సదుపాయాల సంస్థ ల్యాబుకు అవసరమైన నిర్మాణాన్ని పూర్తిచేసింది. ల్యాబు యంత్రాలు వచ్చినా ఇప్పటికీ అమర్చకుండా బయటనే ఉంచారు. దీంతో ల్యాబు ఇప్పటికీ ప్రారంభించలేకపోయారు. ఈ ల్యాబు ప్రారంభమైతే రోగ నిర్ధారణ, చికిత్స సులభతరం కానుంది. ఇది ప్రారంభించకపోవడం వల్ల కొన్ని తెమడ పరీక్షలను హైదరాబాద్లోని ప్రభుత్వ నిర్ధారణ కేంద్రంలో చేయించాల్సి వస్తోంది.
ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి
డాక్టర్ సుధార్సింగ్, క్షయ నివారణ అధికారి, వరంగల్ జిల్లా
రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలున్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుడ్ని సంప్రదిస్తే వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తించి సక్రమంగా మందులు వాడితే వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!