సైబర్ వల.. జనం విలవిల
మన ఆశే వారికి ఆయుధం.. మనం నమోదు చేసే సమాచారమే వారికి కల్పతరువు... ఏ రూపంలోనైనా వస్తారు... మాయమాటలు చెబుతారు. బ్యాంకు అధికారిగా ముచ్చటిస్తారు.. లాటరీ వచ్చిందటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..
పెరుగుతున్న బాధితులు
న్యూస్టుడే, వరంగల్ క్రైం: మన ఆశే వారికి ఆయుధం.. మనం నమోదు చేసే సమాచారమే వారికి కల్పతరువు... ఏ రూపంలోనైనా వస్తారు... మాయమాటలు చెబుతారు. బ్యాంకు అధికారిగా ముచ్చటిస్తారు.. లాటరీ వచ్చిందటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామని.. యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి.. వ్యాపారిలా చాటింగ్ చేసి అందినంత గుంజేస్తారు.. క్రిడెట్, డెబిట్ కార్డుల సమాచారం తస్కరించి ఆన్లైన్లోనే నగదు కాజేస్తారు. నెట్టింట్లో వైరస్లా తిష్ఠ వేస్తారు. హ్యాకర్గా ముప్పుతిప్పలు పెడతారు. మన కష్టార్జితం క్షణాల్లో పోతుంది..
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓటీపీలు, వ్యాలెట్ల యూపీఐల సంఖ్యలను తీసుకొని ఖాతాల్లో నుంచి సొమ్మును కాజేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్లో రోజుకో చోట సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీలో పనిచేస్తున్నామని, మరోచోటకి బదిలీ అయిందని, వాహనాలు, ఫర్నిచర్ తక్కువ ధరకు అమ్మేస్తున్నామని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో పాలనాధికారుల వాట్సప్ స్టేటస్లను వాడుకొని మోసం చేసిన ఘటనలూ ఉన్నాయి.
కమిషనరేట్లోని సైబర్ విభాగంలో పనిచేస్తున్న పోలీసులు
మోసాలు ఇలా
* సుబేదారి ఠాణా పరిధిలో విశ్రాంత ఉద్యోగికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ బ్యాంక్ కార్డు సమయం అయిపోయింది, వెంటనే అప్డెట్ చేయాలని, చరవాణికి వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలని సూచించాడు. సదరు విశ్రాంత ఉద్యోగి ఓటీపీ నెంబర్ చెప్పడంతో ఖాతా నుంచి రూ. 85వేలు ఇతర ఖాతాల్లోకి వెళ్లాయి. తిరిగి చెల్లిస్తామని చెప్పి మరో రూ. 25వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
*కారు యజమాని విదేశాలకు వెళ్తున్నాడు, అతని విలువైన కారును తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి హనుమకొండకు చెందిన వ్యాపారికి రూ. 2 లక్షలు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు.
* ఇంటి నుంచి చేసే ఉద్యోగం ఇస్తామని చెప్పి వరంగల్కు చెందిన విద్యార్థిని ఖాతా నుంచి నేరగాళ్లు సుమారు రూ. 50 వేలు కాజేశారు.
* కాజీపేట వెంకటాద్రినగర్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్కు కేవైసీ అప్డేట్ చేయాలని సందేశంతో కూడిన లింక్ రాగా అది నిజమేనని నమ్మి ఓటీపీ సహా అన్ని వివరాలు నమోదు చేసిన కొంత సేపటికి అతడి ఖాతా నుంచి రూ.25 వేలు బదిలీ అయ్యాయి.
* క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామని దర్గా కాజీపేటకు చెందిన ఓ వ్యక్తి ఫొన్కు లింక్ రాగా దాన్ని ఒపెన్ చేసి అన్ని వివరాలు నమోదు చేశాడు. కొద్ది సేపటికి అతడి ఖాతా నుంచి రూ.1.11 లక్షలు ఉపసంహరించినట్లు సంక్షిప్త సమాచారం రావడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు..
ఇలా నియంత్రించాలి..
* చరవాణులకు వచ్చే లింక్లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు.
* తెలియని వ్యక్తులు పంపించే లింక్లను వెంటనే డిలిట్ చేయాలి.
* లావాదేవీలను బ్యాంక్లకు వెళ్లి సరిచూసుకోవాలి. బ్యాంక్ అధికారులు ఎప్పుడు ఖాతాదారులకు ఫోన్ చేయరు.
* గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయొద్దు, వ్యక్తిగత వివరాలు తెలియజేయొద్దు.
* చరవాణులకు వచ్చిన ఓటీపీ నెంబర్లను ఇతర వ్యక్తులకు చెప్పొద్దు.
* సైబర్ నేరగాళ్లు యాప్లను డౌన్లోడ్ చేయాలని చెబుతారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు.
* సైబర్ నేరాగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 లేదా డయల్ 100 కాల్ చేయాలి. సంబంధిత ఠాణాలో ఫిర్యాదు చేయాలి.
అవగాహన కల్పిస్తున్నా..
సైబర్ మోసాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా కొందరు మోసాల బారిన పడుతూనే ఉన్నారు. కమిషనరేట్ పరిధలో ఇప్పటి వరకు వేయికి పైగా సదస్సులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు కొత పంథాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ల్యాబ్ ఏర్పాటు
గతంలో బాధితులు ఫిర్యాదు చేస్తే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల సహకారంతో విచారణ జరిపేవారు. కేసుల సంఖ్య పెరగడంతో 2018 మార్చి 18న వరంగల్ పోలీసు కమిషనరేట్లో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు దిల్లీ, హరియాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. అరెస్టు చేసి సొమ్ము రాబట్టగలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM