నిరాశ వద్దు.. కొలువే హద్దు
గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు.
న్యూస్టుడే, రంగంపేట, నర్సంపేట: గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు. చాలా మంది ఇళ్లకు దూరంగా నగరాల్లో, పట్టణాల్లో ఉండి పుస్తకాలతో కుస్తీ పట్టారు. 2022 అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను వేలాది మంది రాశారు. పోటీ పరీక్షల పేపర్ల లీకేజీ క్రమంలో ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగార్థుల్లో నైరాశ్యం నెలకొంది. రెండు, మూడు రోజులు డీలా పడిన యువత ఇప్పుడిప్పుడే మళ్లీ తేరుకొని పరీక్షకు సై అంటున్నారు.
గ్రూప్1 పరీక్షకు జిల్లా నుంచి వేలాది మంది యువకులు రాత్రనక పగలనక కష్టపడి చదివారు. ఉదయాన్నే గ్రంథాలయాలకు వచ్చి రాత్రి తిరిగి మూసేవరకు పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఆహారం కూడా తినకుండా చదువుకుంటున్న యువత పోటీతత్వం చూసి అధికారులు ఆయా గ్రంథాలయాల వద్ద రూ.5కే భోజనం కూడా ఏర్పాటుచేశారు. అలా జిల్లా నుంచి వేలాది మంది ప్రిలిమ్స్కు సిద్ధమయ్యారు. అక్టోబరు 16న పరీక్ష రాయగా, జనవరి 13న ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణులైన వారి నుంచి 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేశారు. విజయం సాధించిన వారు మెయిన్స్కు సిద్ధం అవుతున్న తరుణంలో ప్రశ్నపత్రాల లీకేజీ వీరి పాలిట అశనిపాతమైంది. ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తిరిగి కష్టపడి చదవాల్సి వస్తోంది. వరంగల్ రంగంపేటలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం, వరంగల్ ఎల్లమ్మబజారు జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నారు. నిరాశ వీడి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని గ్రూపు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన సీనియర్లు అంటున్నారు. రాసిన వెంటనే కొలువు సాధించలేదని, రెండు మూడు సార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పోటీపడి చదివి నెగ్గామంటున్నారు.
ఏడు నెలలు చదివాను: కిరణ్, వరంగల్
నేను ఏంఎ ఎకనామిక్స్, బీఎడ్ చేశాను. గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం ఏడు నెలలుగా చదివాను. మెయిన్స్కు అర్హతకు పొందాను. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఎంతో శ్రద్ధగా చదువుతున్నాను. ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయడంతో మానసికంగా కుంగి పోయాను. మళ్లీ మొదటి నుంచి చదవాల్సి వస్తోంది. టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయింది. ఈసారైనా జాగ్రత్తగా నిర్వహిస్తే ఉద్యోగం సాధించగలననే నమ్మకముంది.
మళ్లీ లక్ష్యం కోసం శ్రమిస్తున్నా: తీగల రజిత, వరంగల్
నేను దివ్యాంగురాలిని. పీజీ చదివాను. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నా. గ్రూపు-1 కొట్టాలనేది నా లక్ష్యం. ఏడాదిన్నర నుంచి పరీక్షకు సిద్ధమయ్యా. ప్రిలిమ్స్ పాసై మెయిన్స్కు అర్హత సాధించాను. ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో ప్రిలిమ్స్ రద్దు చేయడం బాధనిపించింది. కష్టపడి చదివే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. వందలాది మంది యువతీ, యువకులు నిరుత్సాహం చెందారు.మళ్లీ లక్ష్యం కోసం శ్రమిస్తున్నా.
సమాయత్తం అవుతున్నా: ముగ్దంగుల సంధ్య, డీటీ కరకగూడెం(అశోక్నగర్)
నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం చేస్తున్నాను. 2016లో జరిగిన గ్రూపు 2 పరీక్ష రాసి 2020లో ఉద్యోగంలో చేరాను. గ్రూప్ 1 ఉద్యోగం కావాలనే సంకల్పంతో ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత పొందాను. పేపర్ లీకేజీతో ఆ పరీక్ష రద్దు అయింది. జరిగిన దానికి బాధపడకుండా ఉన్న సమయంలో మరింత పట్టుదలగా చదివి నా ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తున్నాను.
కష్టపడక తప్పదు: బేతి జ్యోతి, నర్సంపేట
లీకైన పేపరు ఎవరికైతే అందిందో వారిని గుర్తించి వేటు వేస్తే సరిపోయేది. కాని గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేను ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత పొందాను. మొయిన్స్ కోసం ప్రణాళిక పద్దతిలో సమాయత్తం అవుతున్న క్రమంలో ప్రిలిమ్స్ రద్దు చేయడం బాధనిపించింది. ఇప్పుడు ప్రిలిమ్స్ కోసం కష్టపడక తప్పదు. ఏమైనా సర్కార్ తప్పునకు తాము బలికావాల్సి వచ్చింది.
సన్నద్ధతకు సమయం కేటాయిస్తే విజయం మీదే
-పతంగి భాస్కర్, డీటీ టేకుమట్ల (నర్సంపేట)
ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం అర్హత పొందిన వారికి తీరని బాధ కలిగిస్తుందనేది నిజం. దాని గురించి ఆలోచించకుండా ఉన్న సమయాన్ని సన్నద్ధతను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకోవాలి. మరింత పట్టుదలగా చదివి మెరుగైన ఫలితాలు పొందొచ్చు. తాను ఒకటి, రెండు సార్లు పరీక్ష రాసి విఫలమైనా పట్టువీడకుండా గ్రూప్ 2 రాసి కొలువు పొందాను. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఒకసారి విఫలమైనా..
- డాక్టర్ భూక్య నర్సింహస్వామి, ఐఎఫ్ఎస్ (చింతకుంట తండా)
నాది ములుగు మండలం పత్తిపల్లి శివారు చింతకుంటతండా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష మొదటసారి రాసినప్పుడు సరైన మార్కులు రాలేదు. కుంగిపోకుండా మరింత కసిపెంచుకొని క్రమశిక్షణతో ప్రణాళిక పద్దతిలో చదివా. 2019లో రెండోసారి పరీక్ష రాయగా 741 ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్నా. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైతే అక్కడితో ఆగిపోకుండా శక్తిని ప్రోది చేసుకొని ముందుకు సాగాలి. అధైర్యం చెందకుండా మరింత పట్టుదలగా చదివి కల సాకారం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.