పిల్లల ఆరోగ్య రక్షణకు పోషణ్ పఖ్వాడా
పిల్లల్లో పోషకాహార లోపంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. బరువు తక్కువగా ఉండడం, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి.
జనగామలో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది
జనగామ టౌన్, న్యూస్టుడే: పిల్లల్లో పోషకాహార లోపంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. బరువు తక్కువగా ఉండడం, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. బాలల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించి మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో ఈ నెల 20 నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో పోషణ్ పక్వాడా పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
జిల్లా సంక్షేమశాఖ ద్వారా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అందించాల్సిన పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. కలెక్టర్ శివలింగయ్య ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి ఆధ్వర్యంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యకర చిన్నారులకు పురస్కారాలు
ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలను గుర్తిస్తారు. వారిలో వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండి, పోషకాహార లోపం లేని చిన్నారులను గుర్తించి వెల్ బేబీ పురస్కారాలు అందజేయనున్నారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లల కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
చిరు ధాన్యాలు అందించండి
పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాలైన కొర్రలు, అరికెలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కుసుమలు, అండు కొర్రలు.. తదితరాలను పిల్లలకు అందించాలని సూచిస్తున్నారు. వీటిలో అధిక శాతం విటమిన్ బీ-12, బీ-17, బీ-6, పీచు పదార్థాలు ఉంటాయి. గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 23న జనగామ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పోషణ్ పక్వాడాపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. 25 నుంచి 28వ తేదీ వరకు రక్తహీనతపై మహిళలు, పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29న కళాశాలల్లో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 31న యోగా, ఏప్రిల్ 1న స్వయం సహాయక సంఘాలతో చిరు ధాన్యాలపై అవగాహన, 3న మహిళల భర్తలతో పోషకాహారంపై వంటల పోటీలు నిర్వహిం నున్నారు. అన్ని గ్రామాల్లో పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించాలని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు సందర్శించేలా చర్యలు చేపట్టనున్నారు.
పోషకాహార ప్రాధాన్యాన్ని తెలిపేందుకే.. : జయంతి, జిల్లా సంక్షేమ అధికారిణి
ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 3 వరకు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చిరు ధాన్యాలు, పోషకాహార ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల్లో పోషక లోపం లేకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్