కీర్తిగడించిన ఓరుగల్లువాసులు
తెలుగు సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలను అందిస్తున్న సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, కవులకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలను ప్రకటించింది.
తెలుగు సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలను అందిస్తున్న సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, కవులకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురికి లభించాయి. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే కార్యక్రమాల్లో పురస్కారాలను అందుకోనున్నారు. పురస్కార గ్రహీతలు, వారు చేసిన కృషిపై ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనం.
న్యూస్టుడే, వరంగల్ సాంస్కృతికం, మానుకోట, దుగ్గొండి
ప్రకృతి వైద్య సాహిత్య గ్రంథాలయానికి గుర్తింపు
ఫ్రొఫెసర్ గజ్జల రామేశ్వరం ‘అంతర్జాతీయ ప్రకృతి వైద్య సాహిత్య గ్రంథాలయం’ వ్యవస్థాపకుడు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు. ప్రకృతి వైద్య సాహిత్య పరిశోధన, అన్వేషణ, సేకరణలో ఆయన మూడు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్నారు. అపూర్వ పుస్తక సంపదతో హనుమకొండలోని తన సొంత ఇంటిలోనే 2018 జులై 24న ప్రత్యేక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఇందులో నాలుగు వేలకు పైగా గ్రంథాలు, పుస్తకాలు ఉన్నాయి. 30 రకాల ప్రకృతి వైద్య పత్రికలకు సంబంధించిన 4,500 పాత సంచికలున్నాయి. వీటిలో అనేకం అరుదైన పుస్తకాలు. రామేశ్వరం సేకరించిన అరుదైన పుస్తకాలను 2010లో హైదరాబాద్లోని భారత వైద్య వారసత్వ చరిత్ర సంస్థ (ఐఐహెచ్ఎం) డిజిటలైజేషన్ చేయడమే కాకుండా కొన్ని పుస్తకాలను ఐఐహెచ్ఎం మ్యూజియంలో ప్రత్యేక అరలో భద్రపరిచింది. ప్రపంచంలో మరుగున పడిన ప్రకృతి వైద్య విజ్ఞాన సాహిత్యాన్ని వెలుగులోకి¨ తీసుకువచ్చినందుకు రామేశ్వరానికి ‘గ్రంథాలయ కర్త’ విభాగంలో పోటీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. తన సాహిత్యాన్ని ప్రచారం చేయడం.. పరిశోధకులకు అందించడం లక్ష్యంలో భాగంగానే ఈ గ్రంథాలయం స్థాపించానని రామేశ్వరం చెప్పారు.
హక్కుల కార్యకర్తగా సేవలు
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన భండారు విజయ మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు అభ్యసించారు. వరంగల్ కృష్ణ కాలనీలోని బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. లైబ్రరీ కోర్సు పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో కేంద్ర గ్రంథాలయంలో పని చేశారు. ‘మహిళా అభ్యుదయ’ కేటగిరీలో ఆమె కీర్తి పురస్కారం అందుకోనున్నారు. గతంలో పలు పుస్తకాలు రచించి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం 40 మంది రచయితలతో కలిసి ఒంటరి మహిళల అంశంపై కథా సంకలనం రూపొందిస్తున్నారు. వచ్చే మాసంలో ఈ సంకలనం ఆవిష్కరించనున్నారు.
‘బలగం’ చిత్రంతో వెలుగులోకి
‘జానపద కళలు’ విభాగంలో వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన బుడిగె జంగాల కళాకారిణి పస్తెం కొమురమ్మకు కీర్తి పురస్కారం లభించింది. ఇటీవల విడుదలైన ‘బలగం’ చిత్రంలో చివరి ఘట్టంలో ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసిన పాటను ఆలపించిన కొమురమ్మ గానామృతానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. చిన్ననాటి నుంచే తాత, తండ్రి ప్రభావంతో కొమురమ్మకు బుర్ర కథల పాటలు పాడడమంటే ఇష్టం. భర్త మొగిలి కళాకారుడు కావడంతో ఇద్దరూ కలిసి శుభకార్యాలు, దశ దిన కర్మల్లో జానపద కళలు ప్రదర్శించారు. ప్రభుత్వం తనకు జానపద ప్రదర్శనల్లో అవకాశం కల్పించాలని ఆమె ‘న్యూస్టుడే’తో పేర్కొన్నారు. అలాగే బుల్లితెర, సినిమాల్లో జానపద కళాకారిణిగా పాటలు పాడేందుకు అవకాశం కల్పిస్తే మరింతగా రాణిస్తానన్నారు.
కథా సాహిత్యంలో సేవలకు..
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ పసునూరి రవీందర్ కవిగా, రచయితగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత రవీందర్. 2015లో ఆయన రచించిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ అనే పుస్తకానికి పురస్కారం దక్కింది. బహుజనుల అభ్యున్నతి లక్ష్యంగా మరిన్ని మంచి రచనలు సామాజిక బాధ్యతగా చేస్తానని రవీందర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ