గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలదే..
ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన అనేక హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు.
సభలో అభివాదం చేెస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు
భూపాలపల్లి, న్యూస్టుడే: ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన అనేక హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చే బాధ్యత వారిదేనని అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి ప్రాంతంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇంటి పట్టాలు వచ్చే వరకు సీపీఐ పార్టీ అండగా ఉంటుందన్నారు. సీపీఐ పని అయిపోయిందని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నీతిని నమ్మిన పార్టీ కావటం వల్లనే సీపీఐకి వందేళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారాస అనుబంధ తెబొగకాసంతో ఏఐటీయూసీ పొత్తు ఉంటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు అన్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే ఏఐటీయూసీ పోటీ చేస్తుందన్నారు.
ఆకట్టుకున్న కళాకారుల నృత్యం..
ప్రజా పోరు యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని మంజూరునగర్ నుంచి హన్మాన్నగర్ వరకు డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఎర్రజెండాలతో మహిళలు, కార్మికులు, కూలీలు, పేదలు పాదయాత్ర నిర్వహించటంతో పట్టణంలోని అంబేడ్కర్ కూడలి ప్రాంతం ఎరుపు రంగుగా తలపించింది. మహిళలు బోనాలు, బతుకమ్మలతో పోరు యాత్రకు స్వాగతం పలికారు. ప్రజా పోరు యాత్ర సీపీఐ కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు రాజ్కుమార్, విజయసారథి, రాజిరెడ్డి, విశ్వేశర్రావు, మల్లికార్జున్రావు, భిక్షపతి, కొరిమి రాజ్కుమార్, మోటపలుకుల రమేష్, సుగుణ, పంజాల రమేష్, సతీష్, ప్రవీణ్, సదాలక్ష్మి, సమ్మిరెడ్డి, వెంకటేష్, భూలక్ష్మి, రాంచందర్, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
దేశాన్ని ఆరుగురు గజదొంగలు దోచుకుంటున్నారు..
‘దొంగలందరి పేర్లలో మోదీ ఆనే పేరు గల వ్యక్తులు ఇద్దరు, ముగ్గురు ఉన్నారని ఓ సభలో మాట్లాడినందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.. దొంగలను దొంగలని సంబోధించకుండా ఏమని పిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ప్రశ్నించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆరుగురు గజదొంగలు దోచుకుతింటున్నారని, వారిలో ఇద్దరు భాజపాకు చెందినవారు, మరో నలుగురు పెట్టుబడిదారులు ఉన్నారని విమర్శించారు. విదేశీ వనితకు పుట్టిన రాహుల్గాంధీ దేశ భక్తుడు కాదని కొందరు భాజపా నేతలు మాట్లాడుతున్నారని.. ఒక తల్లిని విమర్శించే నీచమైన సంస్కృతికి భాజపా పాటుపడటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాకులు, ఎల్ఐసీ, బ్యాంకులను మోదీ ప్రభుత్వం కొంత మంది దొంగలకు కట్టబెట్టిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ కుర్చీ దిగిపోవడం ఖాయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం
[ 18-04-2024]
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. -
అందరి సంక్షేమం.. పార్టీల సంకల్పం
[ 18-04-2024]
ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం.. -
నామపత్రాలకు వేళాయె!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
లోక్సభ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ
[ 18-04-2024]
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తెలిపారు. -
ఓటరుకు ఆహ్వానం..
[ 18-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
అటవీ సంరక్షకులు..!
[ 18-04-2024]
వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు. -
దేవాదుల పంపింగ్ ఆగింది.. పంట ఎండింది..
[ 18-04-2024]
ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. -
పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?
[ 18-04-2024]
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
లోక్సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 18-04-2024]
ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
‘రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన భారాస’
[ 18-04-2024]
‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ఆరోపించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సూచించారు. -
డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!
[ 18-04-2024]
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. -
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల నరికివేత
[ 18-04-2024]
కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సివిల్స్ ర్యాంకర్లకు ఘన సత్కారం
[ 18-04-2024]
సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్ కుమారుడు మెరుగు కౌశిక్ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్ ఫెడరేషన్), ఐవీఎఫ్(ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్), ఇతర ప్రతినిధులు హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. -
చేసిన పనులకు బిల్లులివ్వకపోతే చనిపోతా..
[ 18-04-2024]
‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్