తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, కమిషనర్ అవినాష్
భూపాలపల్లి, న్యూస్టుడే: వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో పురపాలక సంఘం సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి బోర్లు వేశామన్నారు. మూలకుపడ్డ బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్న వీధుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణంలో ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు కోసం అనుకూలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కార్మికులు ఎక్కువగా ఉండే రాంనగర్కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రెండు పడక గదుల ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ కోరారు. రెండు ఏళ్లుగా ఇళ్లు నిరుపయోగంగా ఉంటున్నాయని, సత్వరంగా వాటిని పేద కుటుంబాలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, కమిషనర్ అవినాష్, ఏఈ రోజారాణి, మేనేజర్ స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రశాంతి, నవీన్, ఆర్ఐ భాస్కర్, సుభాష్, విష్ణువర్థన్ వివిధ శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా