రామచంద్రగూడెంలో న్యాయమూర్తి ప్రీతి సందడి
న్యాయమూర్తిగా ఎంపికై అమ్మమ్మ గ్రామమైన రఘునాథపల్లి మండలం రామచంద్రగూడెంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన దామెర్ల సిద్ధయ్య రమ దంపతుల కుమార్తె ప్రీతి బుధవారం సందడి చేశారు.
ప్రీతిని సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు
రఘునాథపల్లి, న్యూస్టుడే: న్యాయమూర్తిగా ఎంపికై అమ్మమ్మ గ్రామమైన రఘునాథపల్లి మండలం రామచంద్రగూడెంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన దామెర్ల సిద్ధయ్య రమ దంపతుల కుమార్తె ప్రీతి బుధవారం సందడి చేశారు. తాత యామంటి మల్లయ్య మరణానంతరం అమ్మమ్మ యోగక్షేమాలను తెలుసుకునేందుకు తల్లి రమతో కలిసి గ్రామానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ఊరంతా తిరిగి గ్రామస్థులతో ముచ్చటించారు. హైదరాబాద్ కేశవ్ మెమోరియల్ కళాశాలలో ఎల్ఎల్బి చదువుకున్న ప్రీతి నల్సార్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేసి గతేడాదీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షలో 25 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికై ఆమె మొదటిసారిగా అమ్మమ్మ ఇంటికి రావడంతో సర్పంచి పయ్యావుల లావణ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ప్రీతి మాట్లాడుతూ సమాజసేవలో భాగంగా బాధితులకు న్యాయం అందించాలని, తలితండ్రుల ఆశలు నెరవేర్చాలనే దృఢ సంకల్పతో జడ్జి పదవిపొందానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉప్పమ్మ, ఎలేందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా